అమరావతి నినాదాన్ని ఢిల్లీలో వినిపించేందుకు సిద్ధమైన రైతులు
- February 02, 2020
న్యూ ఢిల్లీ:అమరావతి ఉద్యమం హస్తిన తాకనుంది.. ఇప్పటి వరకు అమరావతిలోనే ఆందోళనలు చేస్తూ తమ నిరసన తెలుపుతున్న రైతులు.. తమ నినాదాన్ని ఢిల్లీలో వినిపించేందుకు సిద్ధమయ్యారు. రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలిపేందుకు ఇప్పటికే అమరావతి రైతులు, జేఏసీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.
దాదాపు 47 రోజులకు పైగా రాజధాని అంశంపై పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ అపాయింట్మెంట్ దొరికితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పారు. రైతుల పోరాటానికి తగిన న్యాయం చేయాలని కోరుతామన్నారు.
రాజధానిలో ఇప్పటి వరకు 30 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయినా రాష్ట్ర ప్రభుత్వం చలించడం లేదని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. వీలనైంత ఎక్కువ మంది కేంద్రమంత్రులను కలిసి రాజధానిపై స్పష్టమైన హామీ తీసుకున్నాకే ఢిల్లీ నుంచి తిరిగి వెళ్లామంటున్నారు రైతులు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







