కరోనా వైరస్ ఎఫెక్ట్ ... పెంపుడు జంతువులను చంపేస్తున్న చైనీయులు
- February 02, 2020
చైనా ప్రజలను కరోనా వైరస్ భయం పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ జంతువుల ద్వారా వ్యాపిస్తుందని తేలింది. దీంతో తమ ఇళ్ళలో ఉన్న పెంపుడు జంతువులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. దీంతో భవనాలపైకి తీసుకెళ్లి అక్కడ నుంచి కిందికి తోసి చంపేస్తున్నారు. దీంతో పలు వీధుల్లో చనిపోయిన పెంపుడు జంతువుల కళేభరాలు కనిపిస్తున్నాయి. ఈ వైరస్కు చైనాలోని వుహాన్ నగరం కేంద్రంగా ఉన్న విషయం తెల్సిందే. ఈ వ్యాధి బారినపడిన వారిని ప్రత్యేక శిబిరాల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే, వైరస్ సోకిన వ్యక్తులతో గడిపిన జంతువులను కూడా క్యారంటైన్లలో ఉంచి వైద్యం చేస్తున్నారు.
అయితే, పెంపుడు జంతువుల వల్ల ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుందని బాగా నమ్మేస్తోన్న చైనా ప్రజలు కుక్కలను, పిల్లులను తాముంటున్న అపార్ట్మెంట్ల మీద నుంచి కిందకు పడేస్తున్నారు. దీంతో అవి చనిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వస్తున్నాయి. జంతువును చంపకూడదని అక్కడడి ప్రభుత్వం సూచనలు చేస్తోంది. కుక్కలు, పిల్లులతో కరోనా వ్యాపిస్తుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







