చైనాలో మరో భయంకర వైరస్!
- February 02, 2020
బీజింగ్: ఇప్పటికే కరోనాతో విలవిలలాడిపోతున్న చైనాలో మరో భయంకర వైరస్ వెలుగుచూసింది. తాజాగా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లను కూడా గుర్తించినట్లు ఆ దేశ వ్యవసాయశాఖ మంత్రి వెల్లడించారు. కరోనాకు కేంద్రంగా ఉన్న హుబి ప్రావిన్సు దక్షిణాన ఉన్న హునన్ ప్రావిన్సులో బర్డ్ ఫ్లూకు కారణమయ్యే హెచ్5ఎన్1 వైరస్ గుర్తించినట్లు తెలిపారు. షయోయాంగ్ నగరం శివారులోని ఓ కోళ్లఫారమ్లో ఈ వైరస్ ధాటికి ఇప్పటి వరకు 4500 కోళ్లు మరణించినట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని మిగతా వాటిని వేరుచేశారు. ఫ్లూ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు మనుషులెవరూ ప్రభావితం కాలేదు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!