చైనాలో మరో భయంకర వైరస్!
- February 02, 2020
బీజింగ్: ఇప్పటికే కరోనాతో విలవిలలాడిపోతున్న చైనాలో మరో భయంకర వైరస్ వెలుగుచూసింది. తాజాగా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లను కూడా గుర్తించినట్లు ఆ దేశ వ్యవసాయశాఖ మంత్రి వెల్లడించారు. కరోనాకు కేంద్రంగా ఉన్న హుబి ప్రావిన్సు దక్షిణాన ఉన్న హునన్ ప్రావిన్సులో బర్డ్ ఫ్లూకు కారణమయ్యే హెచ్5ఎన్1 వైరస్ గుర్తించినట్లు తెలిపారు. షయోయాంగ్ నగరం శివారులోని ఓ కోళ్లఫారమ్లో ఈ వైరస్ ధాటికి ఇప్పటి వరకు 4500 కోళ్లు మరణించినట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని మిగతా వాటిని వేరుచేశారు. ఫ్లూ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు మనుషులెవరూ ప్రభావితం కాలేదు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







