న్యూజిలాండ్ పై విజయం.. భారత్ క్లీన్ స్వీప్..
- February 02, 2020
న్యూజిలాండ్ పై జరిగిన ఐదో టీ20 లోను భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. మౌంట్మాంగలో జరిగిన ఈ చివరి టీ20లో టీమిండియా 164 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు కేఎల్ రాహుల్(45; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్లు), రోహిత్ శర్మ(60 రిటైర్డ్ హర్ట్; 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడటంతో పాటు శ్రేయస్ అయ్యర్(33 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
అనంతరం బరిలోకి దిగిన కివీస్ జట్టు 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. దీంతో 7 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. టిమ్ సిఫర్ట్(50), రాస్ టేలర్(53) మినహా అందరూ విఫలమయ్యారు. న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. భారత బౌలర్లు బుమ్రా(3), నవదీప్ సైని, శార్ధూల్ ఠాకూర్ లు చెరో రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







