'పవిత్రమైన నూనె' కోసం తొక్కిసలాట..20 మంది మృతి .!
- February 03, 2020
ఓ మత బోధకుడిపై పెట్టుకున్న గుడ్డినమ్మకం కారణంగా 20 మంది ప్రాణాలు విడిచారు.. 16 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.. టాంజానియాలోని మోషి టౌన్లో ఎవాంజెలికల్ క్రిస్టియన్ చర్చి ఉంది.. అందులో బోనిఫేస్ వాంపోసా అనే ఓ మత బోధకుడు ప్రార్థన కార్యక్రమం పెట్టాడు.. పెడితే పెట్టాడు కానీ… అనవసరమైన గొప్పలు చెప్పుకున్నాడు.. తాను దైవదూతనన్నాడు..సమస్త వ్యాధులను నయం చేసే పవిత్రమైన నూనె తన దగ్గర ఉందన్నాడు.. ఇంకా చాలా చాలా చెప్పాడు.. నిజమే కాబోలనుకున్నారు జనం… మత బోధకుడు చల్లే పవిత్రమైన నూనె ఎక్కడ తమ మీద పడదోనన్న బెంగతో అందరూ ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు.. ఫలితంగా తొక్కసలాట జరిగింది.. రోగాలు నయమవ్వడం దేవుడెరుగు.. ఆ ఘటనలో 20 మంది ప్రాణాలు విడిచారు.. గాయపడిన 16 మంది నూనె జోలికి పోకుండా హాస్పిటల్లో చేరారు.. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మతబోధకుడు అక్కడి నుంచి బిచాణా ఎత్తేశాడు.. పారిపోయిన అతడిని పోలీసులు వెతికి పట్టుకుని జైల్లో తోశారు.. ఇక టాంజానియా అధ్యక్షుడు మగుఫులి జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!