లోక్సభ కు 'ఏపీలో మూడు రాజధానులు' వేడి
- February 04, 2020
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్... ఆ దిశగా వైసీపీ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తుండగా... ఏపీ శాసన మండలిలో బ్రేక్లు పడ్డాయి. అయితే, ఇప్పుడు ఏపీ రాజధానుల వ్యవహారం కాస్త.. లోక్సభను తాకింది.. రాజధానుల వ్యవహారంపై లోక్సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ క్లారిటీ ఇచ్చారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఆ రాష్ట్ర పరిధిలోని అంశమని స్పష్టం చేసిన ఆయన... రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు అన్నారు. గత ప్రభుత్వ జీవో ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతి ఉందని తెలిపారు. కాగా, ఏపీకి మూడు రాజధానులను రూపొందించుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సూచిస్తూ మీడియా నివేదికలు వచ్చాయని.. లోక్సభలో ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. దీంతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ క్లారిటీ ఇచ్చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







