మ్యాథమేటిక్స్‌ ఛాలెంజ్‌లో సత్తా చాటిన ఎన్‌ఎంఎస్‌ స్టూడెంట్‌

- February 05, 2020 , by Maagulf
మ్యాథమేటిక్స్‌ ఛాలెంజ్‌లో సత్తా చాటిన ఎన్‌ఎంఎస్‌ స్టూడెంట్‌

బహ్రెయిన్‌ డిపిఎస్‌ న్యూ మిలీనియం స్కూల్‌లో గ్రేడ్‌ 9 విద్యనభ్యసిస్తున్న విద్యార్థి అద్వయిత్‌ మండార్‌, మేథమేటిక్స్‌ ఛాలెంజ్‌లో సత్తా చాటాడు. లెవల్‌ 2లో పోటీ పడ్డ అద్వయిత్‌, టాప్‌ 100 లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆర్యభట్ట గనిత్‌ ఛాలెంజ్‌ 2019 పేరుతో ఈ పోటీలు నిర్వహించారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌ ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా వున్న స్కూళ్ళకు పోటీలు నిర్వహఙంచింది. కంప్యూటర్‌ బేస్ట్‌ కంటెస్ట్‌, స్టూడెంట్స్‌లో పోటీతత్వాన్ని పెంచేలా రూపొందించడం జరిగింది. చైర్మన్‌ డాక్టర్‌ రవి పిళ్ళయ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా పిళ్ళయ్‌, ప్రిన్సిపల్‌ అరుణ్‌కుమార్‌ శర్మ తదితరులు అద్వయిత్‌ సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com