కువైట్:ఇంకా అపరిష్కృతంగానే పబ్లిక్ టాయిలెట్స్ సమస్య
- February 06, 2020
కువైట్ సిటీలో పబ్లిక్ టాయిలెట్స్ సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉంది. కేపిటల్ గవర్నరేట్ పరిధిలో పబ్లిక్ బాత్రూమ్స్ ను ఎలా నిర్వహించాలనే అంశంపై గత సమ్మర్ నుంచి మున్సిపాలిటీ కమిటీ పలుమార్లు సమావేశమైంది. పబ్లిక్ బాత్రూమ్ నిర్వహణను పబ్లిక్ యుటిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీకి అప్పగించేందుకు మున్సిపాలిటీ కమిటీ తిరస్కరించింది. అయినా ఇంకా సమస్యకు పరిష్కారం లభించలేదు. పబ్లిక్ బాత్రూమ్స్ నిర్వహణకు పబ్లిక్ యుటిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీకి ఆర్ధిక స్థోమత సరిపోదనే కారణంతో ఆ కంపెనీని తిరస్కరించినట్లు మున్సిపాలిటీ అధికారులు వివరించారు. అయితే..పబ్లిక్ యుటిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీ వర్గాలు మాత్రం తాము రాజధాని పరిధిలో పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ కు సంబంధించిన ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఎప్పుడు ప్రతిపాదనలను నిరాకరించలేదని తెలిపాయి. ఇదిలాఉంటే కేపిటల్ లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ ఖర్చు అధ్యయనానికి మాత్రమే యుటీలిటి కంపెనికి బాధ్యతలు అప్పటించినట్లు మున్సిపల్ కౌన్సిల్ కమిటీ వివరించింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







