కువైట్:ఇంకా అపరిష్కృతంగానే పబ్లిక్ టాయిలెట్స్ సమస్య
- February 06, 2020
కువైట్ సిటీలో పబ్లిక్ టాయిలెట్స్ సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉంది. కేపిటల్ గవర్నరేట్ పరిధిలో పబ్లిక్ బాత్రూమ్స్ ను ఎలా నిర్వహించాలనే అంశంపై గత సమ్మర్ నుంచి మున్సిపాలిటీ కమిటీ పలుమార్లు సమావేశమైంది. పబ్లిక్ బాత్రూమ్ నిర్వహణను పబ్లిక్ యుటిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీకి అప్పగించేందుకు మున్సిపాలిటీ కమిటీ తిరస్కరించింది. అయినా ఇంకా సమస్యకు పరిష్కారం లభించలేదు. పబ్లిక్ బాత్రూమ్స్ నిర్వహణకు పబ్లిక్ యుటిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీకి ఆర్ధిక స్థోమత సరిపోదనే కారణంతో ఆ కంపెనీని తిరస్కరించినట్లు మున్సిపాలిటీ అధికారులు వివరించారు. అయితే..పబ్లిక్ యుటిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీ వర్గాలు మాత్రం తాము రాజధాని పరిధిలో పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ కు సంబంధించిన ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఎప్పుడు ప్రతిపాదనలను నిరాకరించలేదని తెలిపాయి. ఇదిలాఉంటే కేపిటల్ లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ ఖర్చు అధ్యయనానికి మాత్రమే యుటీలిటి కంపెనికి బాధ్యతలు అప్పటించినట్లు మున్సిపల్ కౌన్సిల్ కమిటీ వివరించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!