దుబాయ్ : చైనాకు ప్రయాణంపై నిషేధం విధించిన సౌదీ అరేబియా

- February 06, 2020 , by Maagulf
దుబాయ్ : చైనాకు ప్రయాణంపై నిషేధం విధించిన సౌదీ అరేబియా

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సౌదీ అరేబియా ప్రభుత్వం ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సౌదీ నుంచి చైనా ప్రయాణాలపై నిషేధించింది. సౌదీ అరేబియా రెసిడెన్స్, నాన్ సౌదీ రెసిడెన్స్ ఎవరూ తాము చెప్పే వరకు చైనా పర్యటనకు వెళ్లొద్దని ఆదేశించింది. ఎవరైనా నిషేధ నిబంధనలను ఉల్లంఘిస్తే తగిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించింది. సౌదీలో ఉండే ప్రవాసీయులు ఎవరైనా చైనాకు వెళ్తే వారిని తిరిగి దేశంలోకి అనుమతించబోమని కూడా క్లారిటీ ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు WHO వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com