యూఏఈ SWAT ఛాలెంజ్ 2020కి రెడీ అంటున్న దుబాయ్ పోలీస్
- February 07, 2020
యూఏఈ:ట్రైనింగ్ సిటీ అల్ రువయ్యలో యూఏఈ SWAT ఛాలెంజ్ 2020 సెకండ్ ఎడిషన్ హోస్ట్ చేసేందుకు దుబాయ్ పోలీసులు సంసిద్ధత వ్యక్తం చేశారు. 30 దేశాల నుంచి 54 టీమ్స్
ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేస్తాయి. బందీలను విడిపించటం, గాయపడిన అధికారులను రక్షించటం, విపత్కర పరిస్థితులను ఎదుర్కొవటం వంటి సవాళ్లను అధిగమించటం
వంటి ఈవెంట్లు ఈ ఛాలెంజ్ లో ఉంటాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉప ప్రధాన మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆధ్వర్యంలో దుబాయ్ పోలీసులు యుఎఇ స్వాట్ ఛాలెంజ్ 2020ని నిర్వహించనున్నారు. దుబాయ్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి ఛాలెంజ్ నిర్వహణకు ఫోర్సెస్ ఎలా సిద్దమయ్యారో పరిశీలించారు. స్వాట్ ఛాలెంజ్ 2020కి వేదికయ్యే లోకేషన్ ను తనిఖీ చేశారు. ఫోర్సెస్ ట్రైనింగ్ అవుతున్న తీరును కాసేపు వీక్షించారు. ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసే అన్ని జట్లకు అన్ని రకాల సాయం అందించటంతో పాటు వారికి నిబంధనలకు సంబంధించి అన్ని జట్లు అవగాహన కల్పించాలని ఆర్గనైజర్లకు ఆయన సూచించారు. స్వాట్ ఛాలెంజ్ కు దుబాయ్ పోలీసులు రెడీ అవుతున్న తీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి..యూఏఈ, యూఎస్ఏకు చెందిన 34 మంది సభ్యుల జడ్జి ప్యానెల్ తో సమావేశమయ్యారు.
_1581065177.jpg)
తాజా వార్తలు
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







