యూఏఈ SWAT ఛాలెంజ్ 2020కి రెడీ అంటున్న దుబాయ్ పోలీస్
- February 07, 2020
యూఏఈ:ట్రైనింగ్ సిటీ అల్ రువయ్యలో యూఏఈ SWAT ఛాలెంజ్ 2020 సెకండ్ ఎడిషన్ హోస్ట్ చేసేందుకు దుబాయ్ పోలీసులు సంసిద్ధత వ్యక్తం చేశారు. 30 దేశాల నుంచి 54 టీమ్స్
ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేస్తాయి. బందీలను విడిపించటం, గాయపడిన అధికారులను రక్షించటం, విపత్కర పరిస్థితులను ఎదుర్కొవటం వంటి సవాళ్లను అధిగమించటం
వంటి ఈవెంట్లు ఈ ఛాలెంజ్ లో ఉంటాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉప ప్రధాన మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆధ్వర్యంలో దుబాయ్ పోలీసులు యుఎఇ స్వాట్ ఛాలెంజ్ 2020ని నిర్వహించనున్నారు. దుబాయ్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి ఛాలెంజ్ నిర్వహణకు ఫోర్సెస్ ఎలా సిద్దమయ్యారో పరిశీలించారు. స్వాట్ ఛాలెంజ్ 2020కి వేదికయ్యే లోకేషన్ ను తనిఖీ చేశారు. ఫోర్సెస్ ట్రైనింగ్ అవుతున్న తీరును కాసేపు వీక్షించారు. ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసే అన్ని జట్లకు అన్ని రకాల సాయం అందించటంతో పాటు వారికి నిబంధనలకు సంబంధించి అన్ని జట్లు అవగాహన కల్పించాలని ఆర్గనైజర్లకు ఆయన సూచించారు. స్వాట్ ఛాలెంజ్ కు దుబాయ్ పోలీసులు రెడీ అవుతున్న తీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి..యూఏఈ, యూఎస్ఏకు చెందిన 34 మంది సభ్యుల జడ్జి ప్యానెల్ తో సమావేశమయ్యారు.
_1581065177.jpg)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







