ఫోరెన్సిక్ టీమ్ చలవతో మర్డర్ కేసు నుంచి బయటపడ్డ వ్యక్తి
- February 08, 2020
దుబాయ్:ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలో ఓ వృద్ధుడు మృతి చెందగా, ఈ ఘటనలో మరో వ్యక్తిపై కేసు నమోదయ్యింది. 30 ఏళ్ళ వ్యక్తిని ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. 50 ఏళ్ళ వ్యక్తి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే, తన మీద ఆ 50 ఏళ్ళ వ్యక్తి దాడి చేశారనీ, తాను అతనిపై దాడి చేయలేదనీ నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు. కేసు విచారణను లోతుగా పరిశీలించిన అధికారులు, ఫోరెన్సిక్ టీమ్ అందించిన వివరాల్ని విశ్లేషించారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో, 50 ఏళ్ళ వ్యక్తికి గుండె సంబంధిత సమస్యలున్నాయనీ, గొడవ జరగడానికంటే ముందే అతను గుండె నొప్పితో బాధపడుతున్నాడనీ, అయితే గొడవ జరిగినప్పుడు దాన్ని పట్టించుకోకుండా దుందుడుకుగా వ్యవహరించడంతో ఆ గలాటాలో ప్రాణాలు కోల్పోయాడు తప్ప, 30 ఏళ్ళ వ్యక్తి అతని మీద ఎలాంటి దాడీ చేయలేదని తేలింది. దుబాయ్ పోలీస్ అత్యంత చాకచక్యంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, కేసు విచారణను ఓ కొలిక్కి తెచ్చారని అధికారులు చెబుతున్నారు.
_1581156609.jpg)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







