ఫోరెన్సిక్ టీమ్ చలవతో మర్డర్ కేసు నుంచి బయటపడ్డ వ్యక్తి
- February 08, 2020
దుబాయ్:ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలో ఓ వృద్ధుడు మృతి చెందగా, ఈ ఘటనలో మరో వ్యక్తిపై కేసు నమోదయ్యింది. 30 ఏళ్ళ వ్యక్తిని ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. 50 ఏళ్ళ వ్యక్తి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే, తన మీద ఆ 50 ఏళ్ళ వ్యక్తి దాడి చేశారనీ, తాను అతనిపై దాడి చేయలేదనీ నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు. కేసు విచారణను లోతుగా పరిశీలించిన అధికారులు, ఫోరెన్సిక్ టీమ్ అందించిన వివరాల్ని విశ్లేషించారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో, 50 ఏళ్ళ వ్యక్తికి గుండె సంబంధిత సమస్యలున్నాయనీ, గొడవ జరగడానికంటే ముందే అతను గుండె నొప్పితో బాధపడుతున్నాడనీ, అయితే గొడవ జరిగినప్పుడు దాన్ని పట్టించుకోకుండా దుందుడుకుగా వ్యవహరించడంతో ఆ గలాటాలో ప్రాణాలు కోల్పోయాడు తప్ప, 30 ఏళ్ళ వ్యక్తి అతని మీద ఎలాంటి దాడీ చేయలేదని తేలింది. దుబాయ్ పోలీస్ అత్యంత చాకచక్యంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, కేసు విచారణను ఓ కొలిక్కి తెచ్చారని అధికారులు చెబుతున్నారు.
_1581156609.jpg)
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







