ఫోరెన్సిక్ టీమ్ చలవతో మర్డర్ కేసు నుంచి బయటపడ్డ వ్యక్తి
- February 08, 2020
దుబాయ్:ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలో ఓ వృద్ధుడు మృతి చెందగా, ఈ ఘటనలో మరో వ్యక్తిపై కేసు నమోదయ్యింది. 30 ఏళ్ళ వ్యక్తిని ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. 50 ఏళ్ళ వ్యక్తి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే, తన మీద ఆ 50 ఏళ్ళ వ్యక్తి దాడి చేశారనీ, తాను అతనిపై దాడి చేయలేదనీ నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు. కేసు విచారణను లోతుగా పరిశీలించిన అధికారులు, ఫోరెన్సిక్ టీమ్ అందించిన వివరాల్ని విశ్లేషించారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో, 50 ఏళ్ళ వ్యక్తికి గుండె సంబంధిత సమస్యలున్నాయనీ, గొడవ జరగడానికంటే ముందే అతను గుండె నొప్పితో బాధపడుతున్నాడనీ, అయితే గొడవ జరిగినప్పుడు దాన్ని పట్టించుకోకుండా దుందుడుకుగా వ్యవహరించడంతో ఆ గలాటాలో ప్రాణాలు కోల్పోయాడు తప్ప, 30 ఏళ్ళ వ్యక్తి అతని మీద ఎలాంటి దాడీ చేయలేదని తేలింది. దుబాయ్ పోలీస్ అత్యంత చాకచక్యంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, కేసు విచారణను ఓ కొలిక్కి తెచ్చారని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!