ఫోరెన్సిక్ టీమ్ చలవతో మర్డర్ కేసు నుంచి బయటపడ్డ వ్యక్తి
- February 08, 2020
దుబాయ్:ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలో ఓ వృద్ధుడు మృతి చెందగా, ఈ ఘటనలో మరో వ్యక్తిపై కేసు నమోదయ్యింది. 30 ఏళ్ళ వ్యక్తిని ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. 50 ఏళ్ళ వ్యక్తి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే, తన మీద ఆ 50 ఏళ్ళ వ్యక్తి దాడి చేశారనీ, తాను అతనిపై దాడి చేయలేదనీ నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు. కేసు విచారణను లోతుగా పరిశీలించిన అధికారులు, ఫోరెన్సిక్ టీమ్ అందించిన వివరాల్ని విశ్లేషించారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో, 50 ఏళ్ళ వ్యక్తికి గుండె సంబంధిత సమస్యలున్నాయనీ, గొడవ జరగడానికంటే ముందే అతను గుండె నొప్పితో బాధపడుతున్నాడనీ, అయితే గొడవ జరిగినప్పుడు దాన్ని పట్టించుకోకుండా దుందుడుకుగా వ్యవహరించడంతో ఆ గలాటాలో ప్రాణాలు కోల్పోయాడు తప్ప, 30 ఏళ్ళ వ్యక్తి అతని మీద ఎలాంటి దాడీ చేయలేదని తేలింది. దుబాయ్ పోలీస్ అత్యంత చాకచక్యంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, కేసు విచారణను ఓ కొలిక్కి తెచ్చారని అధికారులు చెబుతున్నారు.
_1581156609.jpg)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







