ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న పుల్లెల గోపీచంద్
- February 09, 2020
పుల్లెల గోపీచంద్.. ప్రపంచ టైటిళ్లను అవలీలగా సాధించే ప్లేయర్లను తయారు చేయగలగడం ఆయనకే ప్రత్యేకం. ప్రపంచంలో ఎన్ని బ్యాడ్మింటన్ శిక్షణ సంస్థలు ఉన్నా.. గోపీచంద్ అకాడమీకి క్రీడాకారులు ఇచ్చే గౌరవం వేరు. అందుకే.. అతనంటే అందరికీ అంత గౌరవం.
ఆయన శిక్షణలో రాటుదేలిన సైనా నెహ్వాల్, సింధుతో పాటు మరెంతో మంది క్రీడాకారులు.. బ్యాడ్మింటన్ లో సంచలనాలు సృష్టంచారు. ఇప్పుడు గోపీచంద్ కూడా.. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న ఏకైక భారతీయుడిగా గోపీచంద్ గుర్తింపు పొందారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తనకు దక్కిన పురస్కారాన్ని భారతీయ కోచ్ లందరికీ దక్కినట్టుగా భావిస్తున్నట్టు చెప్పారు.
తనకు ఈ స్థాయి దక్కడంలో కారణాలుగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్, కేంద్రం, క్రీడా మంత్రిత్వ శాఖ, ఒలింపిక్ అసోసియేషన్ లకు గోపీచంద్ కృతజ్ఞతలు తెలిపారు. బ్యాడ్మింటన్ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా.. గోపీచంద్ కు 2019 ఐవోసీ జీవిత సాఫల్య కోచ్ అవార్డు దక్కింది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







