ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న పుల్లెల గోపీచంద్
- February 09, 2020
పుల్లెల గోపీచంద్.. ప్రపంచ టైటిళ్లను అవలీలగా సాధించే ప్లేయర్లను తయారు చేయగలగడం ఆయనకే ప్రత్యేకం. ప్రపంచంలో ఎన్ని బ్యాడ్మింటన్ శిక్షణ సంస్థలు ఉన్నా.. గోపీచంద్ అకాడమీకి క్రీడాకారులు ఇచ్చే గౌరవం వేరు. అందుకే.. అతనంటే అందరికీ అంత గౌరవం.
ఆయన శిక్షణలో రాటుదేలిన సైనా నెహ్వాల్, సింధుతో పాటు మరెంతో మంది క్రీడాకారులు.. బ్యాడ్మింటన్ లో సంచలనాలు సృష్టంచారు. ఇప్పుడు గోపీచంద్ కూడా.. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న ఏకైక భారతీయుడిగా గోపీచంద్ గుర్తింపు పొందారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తనకు దక్కిన పురస్కారాన్ని భారతీయ కోచ్ లందరికీ దక్కినట్టుగా భావిస్తున్నట్టు చెప్పారు.
తనకు ఈ స్థాయి దక్కడంలో కారణాలుగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్, కేంద్రం, క్రీడా మంత్రిత్వ శాఖ, ఒలింపిక్ అసోసియేషన్ లకు గోపీచంద్ కృతజ్ఞతలు తెలిపారు. బ్యాడ్మింటన్ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా.. గోపీచంద్ కు 2019 ఐవోసీ జీవిత సాఫల్య కోచ్ అవార్డు దక్కింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







