శీతాకాలంలో కీళ్లనొప్పులు తగ్గాలంటే ఇలా చెయ్యండి...
- February 10, 2020
వణికించే చలి.. రగ్గు కప్పుకుని వెచ్చగా ముడుచుకుని పడుకుంటే పొద్దునకల్లా కాళ్లు, చేతులు పట్టేసినట్లు ఉంటాయి. అందరికీ అలానే ఉన్నా.. ఇంట్లో పెద్దవారు ఉంటే వారు మరింత ఇబ్బంది పడుతుంటారు బాధించే కీళ్ల నొప్పులతో.. ఓ పక్క చలి.. మరోపక్క కాళ్ల నొప్పులు. మందు బిళ్లలు ఎన్ని వేసుకున్నా మన ప్రయత్నంగా ఉపశమనం కోసం రోజూ ఇలా చేస్తుంటే.. కీళ్ల నొప్పులు కాస్త తగ్గే అవకాశం ఉంది.
సూర్య కిరణాలు పడే ప్రాంతంలో నిదానంగా నడవడం చేస్తుండాలి. చిన్న చిన్న వ్యాయామాలు.. శరీరం మొత్తాన్ని కదిలించేలాగా చేయాలి. నువ్వుల నూనెను గోరు వెచ్చగా చేసి నొప్పులు ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయాలి. గోరు వెచ్చని నీటిని కాపడం పెడుతుండాలి.
వంటింట్లో వాడే పసుపు ఒంటికి చాలా మంచింది. పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణం కీళ్లలో నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. పసుపులో గోరు వెచ్చని నీటిని కలిపి పేస్ట్లాగా తయారు చేసి మోకాళ్లపై పూయాలి. గంటా రెండు గంటలు ఉంచుకుని ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
శరీరానికి తగినంత కాల్షియం, ఖనిజాలు ఇతర పోషకాలు అందించే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కీళ్ల ధృఢత్వానికి, ఇతర సమస్యల నుంచి బయటపడడానికి పాలు, పెరుగు, ఆకు కూరలు, నువ్వులు, అంజీర, సోయ, బాదం పాలు వంటి పోషకాహారాలను తీసుకోవాలి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









