అతి ఖరీదైన షిప్ కొనుగోలు చేసిన బిల్గేట్స్
- February 10, 2020ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు.. బిల్గేట్స్ ఓ అద్భతమైన షిప్ ను కొనుగోలు చేశారు. దాని ఖరీదు రూ.4600 కోట్లు. ఈ షిప్ పేరు ''ఆక్వా''అత్యంత విలాసవంతమైన యాట్ (విహార నౌక)ను బిల్గేట్స్ 2019లో కొన్నారు. మొనాకోలో నిర్వహించిన యాట్షోలో ఈ అద్భుతమైన షిప్ నమూనాను ఆయన ఎంతో ముచ్చటపడిపోయారు. పైగా అది పర్యావరణ హితమైనదని తెలిసి ఒక ఏమాత్రం ఆలోచించలేదు. వెంటనే కొనేశారు.
నమూనాగా ఉన్న ఆ షిప్ ను చూసిన బిల్ గేట్స్ పర్యావరణానికి ఎటువంటి హానీ చేయని విధంగా ద్రవ హైడ్రోజన్తో నడుస్తుందని తెలియడంతో వెంటనే షిప్ తయారీకి కావాల్సిన డబ్బును బిల్గేట్స్ ఏమాత్రం ఆలోచించకుండూ ఇచ్చేశారు. వెంటనే షిప్ తయారు చేయమని చెప్పేశారు. కాగా..ప్రపంచ కుబేరుల్లో రెండవ స్థానంలో ఉన్న బిల్ గేడ్స్ కు ఇప్పటి వరకూ సొంతగా విహార నౌక లేదు. తన కుటుంబంతో కలిసి షిప్ లో విహరించాలనుకుంటే ప్రైవేట్ యాట్లనే ఆయన ఇప్పటి వరకూ అద్దెకు తీసుకునేవారు. కానీ..పర్యవరణ హితమైన ఈ షిప్ గురించి తెలిసిన ఆయన పర్యావరణంపై ప్రేమతోనే ఈ షిప్ ను కొనుగోలు చేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?