అతి ఖరీదైన షిప్ కొనుగోలు చేసిన బిల్గేట్స్
- February 10, 2020ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు.. బిల్గేట్స్ ఓ అద్భతమైన షిప్ ను కొనుగోలు చేశారు. దాని ఖరీదు రూ.4600 కోట్లు. ఈ షిప్ పేరు ''ఆక్వా''అత్యంత విలాసవంతమైన యాట్ (విహార నౌక)ను బిల్గేట్స్ 2019లో కొన్నారు. మొనాకోలో నిర్వహించిన యాట్షోలో ఈ అద్భుతమైన షిప్ నమూనాను ఆయన ఎంతో ముచ్చటపడిపోయారు. పైగా అది పర్యావరణ హితమైనదని తెలిసి ఒక ఏమాత్రం ఆలోచించలేదు. వెంటనే కొనేశారు.
నమూనాగా ఉన్న ఆ షిప్ ను చూసిన బిల్ గేట్స్ పర్యావరణానికి ఎటువంటి హానీ చేయని విధంగా ద్రవ హైడ్రోజన్తో నడుస్తుందని తెలియడంతో వెంటనే షిప్ తయారీకి కావాల్సిన డబ్బును బిల్గేట్స్ ఏమాత్రం ఆలోచించకుండూ ఇచ్చేశారు. వెంటనే షిప్ తయారు చేయమని చెప్పేశారు. కాగా..ప్రపంచ కుబేరుల్లో రెండవ స్థానంలో ఉన్న బిల్ గేడ్స్ కు ఇప్పటి వరకూ సొంతగా విహార నౌక లేదు. తన కుటుంబంతో కలిసి షిప్ లో విహరించాలనుకుంటే ప్రైవేట్ యాట్లనే ఆయన ఇప్పటి వరకూ అద్దెకు తీసుకునేవారు. కానీ..పర్యవరణ హితమైన ఈ షిప్ గురించి తెలిసిన ఆయన పర్యావరణంపై ప్రేమతోనే ఈ షిప్ ను కొనుగోలు చేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..