ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టడంలో వరుసగా నాలుగోసారి విఫలం అయిన ఇరాన్
- February 10, 2020
ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. అమెరికాపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్, క్షిపణి-ఉపగ్రహ ప్రయోగాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజా ఇరాన్లోని రివల్యూష నరీ గార్డ్స్ అధునాతన బాలిస్టిక్ క్షిపణిని ఆవిష్కరించింది. రాద్-500 అనే క్షిపణిలో జొహెయిర్ ఇంజిన్ను అమర్చారు. మిశ్రమ పదార్థాలతో ఈ ఇంజిన్ తయారైంది. ఉక్కుతో రూపొందిన ఇతర ఇంజిన్ల కన్నా తేలిగ్గా ఉంటుంది. ఈ మిస్సైల్ 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. న్యూ మిస్సైల్లో కొత్త తరం ఇంజిన్లు ఉన్నాయని, ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు రూపొందించామని రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. ఇరాన్ క్షిపణి అణు కార్యక్రమాలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరాన్ మిస్సైల్ టెస్ట్ చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే, ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో ఇరాన్ మళ్లీ విఫలమైంది. నింగిలోకి రాకెట్ విజయవంతంగానే దూసుకెళ్లినప్పటికీ, జఫర్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఇరాన్ ఉపగ్రహ ప్రయోగం విఫలం కావడం వరుసగా ఇది నాలుగోసారి. 2019 నాటి ప్రయోగంలో రాకెట్ అనుకున్న వేగం అందుకోకపోవడంతో మధ్యలోనే కుప్పకూలింది. ఫిబ్రవరి, ఆగస్టులలో జరిగిన ఎక్స్పెరిమెంట్లు కూడా ఫెయిలయ్యయి. ఐతే, ప్రయోగం విఫలమైనప్పటికీ తమ మిషన్ మాత్రం ఆగబోదని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ ప్రయత్నాలను అమెరికా తీవ్రంగా తప్పుపట్టింది. దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతను సమకూర్చుకోవడానికి ఇరాన్ ప్రయోగాలు చేస్తోందని ఆరోపించింది.
తాజా వార్తలు
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు







