బచాఖాన్‌ విశ్వవిద్యాలయంపై ఉగ్రవాద దాడిని ఖండించిన :మోదీ

- January 20, 2016 , by Maagulf
బచాఖాన్‌ విశ్వవిద్యాలయంపై ఉగ్రవాద దాడిని ఖండించిన :మోదీ

పాకిస్థాన్‌లోని బచాఖాన్‌ విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన దాడిని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఖండించారు. ఈ విషయమై ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఈ ఉగ్రవాదుల చర్య తీవ్రంగా ఖండించదగినదని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. పాక్‌లోని పెషావర్‌లో ఉన్న బచాఖాన్‌ విశ్వవిద్యాలయంలోకి బుధవారం ఉదయం ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతాదళాలు ఇంకా ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com