యూఏఈలో భారతీయుడికి కరోనా..!ఎనిమిదికి చేరిన కరోనా బాధితుల సంఖ్య
- February 11, 2020
దుబాయ్: చైనాని వణికిస్తున్న కరోనా వైరస్ క్రమంగా విదేశాల్లోనూ విస్తరిస్తోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న ఓ భారతీయుడికి ఈ వైరస్ సోకినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్తో బాధపడుతున్న వ్యక్తిని సంప్రదించడం వల్లే వైరస్ అతనికి సోకినట్లు తెలిపింది. దీంతో ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లు పేర్కొంది. వీరిలో ఐదుగురు చైనా వాసులు, మరో ఫిలిప్పీన్స్ దేశస్థుడు ఉన్నట్లు తెలిపింది. గత వారం వుహాన్ నుంచి దుబాయ్కి విహార యాత్రకు వచ్చిన నలుగురిలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల