దుబాయ్: భార్యను రక్షించబోయి మంటల్లో చిక్కకున్న ఇండియన్..90% కాలిన గాయాలు
- February 11, 2020
ప్రమాదవశాత్తు భార్య మంటల్లో చిక్కుకుపోయింది. ఆమెను రక్షించబోయిన భర్తకు మంటలు అంటుకున్నాయి. దీంతో అతనికి 90% కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను అబుదాబిలోని మఫ్రక్ హస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కేరళ దంపతులు కొన్నేళ్లుగా ఉమ్ అల్ కువైన్ లో ఉంటున్నారు. వారికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే.. వారు ఉంటున్న అపార్ట్ మెంట్ కారిడార్ లో ఉన్న ఎలక్ట్రిక్ బాక్స్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు భార్యను అంటుకోవటంతో ఆమెను రక్షించేందుకు భర్త అనిల్ నినన్ ప్రయత్నించటంతో మంటలు అతనికి కూడా అంటుకున్నాయి. భార్య ప్రమాదం నుంచి బయటపడిందిగానీ అనిల్ శరీరం మాత్రం పూర్తిగా కాలిన గాయాలయ్యాయి. దీంతో ఆ దంపతులను హుటాహుటిన షేక్ కలిఫా ఆస్పత్రికి తరలించారు. మహిళకు 10 శాతం కాలిన గాయాలయ్యాయయని..ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే..అనిల్ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. దీంతో మెరుగైన చికిత్స కోసం అతన్ని అబుదాబిలోని మఫ్రక్ ఆస్పత్రికి తరలించారు. క్రిటికల్ కేర్ యూనిట్లో అబ్జర్వేషన్ లో ఉన్నాడు. తాము చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నామని మిగతాది అంతా దేవుడి దయ అని డాక్టర్లు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







