దుబాయ్: భార్యను రక్షించబోయి మంటల్లో చిక్కకున్న ఇండియన్..90% కాలిన గాయాలు
- February 11, 2020
ప్రమాదవశాత్తు భార్య మంటల్లో చిక్కుకుపోయింది. ఆమెను రక్షించబోయిన భర్తకు మంటలు అంటుకున్నాయి. దీంతో అతనికి 90% కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను అబుదాబిలోని మఫ్రక్ హస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కేరళ దంపతులు కొన్నేళ్లుగా ఉమ్ అల్ కువైన్ లో ఉంటున్నారు. వారికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే.. వారు ఉంటున్న అపార్ట్ మెంట్ కారిడార్ లో ఉన్న ఎలక్ట్రిక్ బాక్స్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు భార్యను అంటుకోవటంతో ఆమెను రక్షించేందుకు భర్త అనిల్ నినన్ ప్రయత్నించటంతో మంటలు అతనికి కూడా అంటుకున్నాయి. భార్య ప్రమాదం నుంచి బయటపడిందిగానీ అనిల్ శరీరం మాత్రం పూర్తిగా కాలిన గాయాలయ్యాయి. దీంతో ఆ దంపతులను హుటాహుటిన షేక్ కలిఫా ఆస్పత్రికి తరలించారు. మహిళకు 10 శాతం కాలిన గాయాలయ్యాయయని..ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే..అనిల్ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. దీంతో మెరుగైన చికిత్స కోసం అతన్ని అబుదాబిలోని మఫ్రక్ ఆస్పత్రికి తరలించారు. క్రిటికల్ కేర్ యూనిట్లో అబ్జర్వేషన్ లో ఉన్నాడు. తాము చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నామని మిగతాది అంతా దేవుడి దయ అని డాక్టర్లు చెబుతున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







