కువైట్:వచ్చే నెల నుంచి ఆన్లైన్ రెసిడెన్సీ రెన్యువల్
- February 11, 2020కువైట్:రెసిడెన్సీ రెన్యువల్ ఆఫ్ ఆర్టికల్ 18, మార్చి 2020 నుంచి ఆన్లైన్లో జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మరాఫి ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త విధానం ద్వారా కంపెనీలు మరియు ఇన్స్టిట్యూషన్స్ వలసదారుల రెసిడెన్స్ని రెన్యువల్ చేయడానికి ఆన్లైన్ విధానాన్ని ఆశ్రయించవచ్చు. తద్వారా వారికి సమయం ఆదా అవుతుంది. గవర్నరేట్స్ రెసిడెన్సీ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ కార్యాలయాల్ని సంప్రదించాల్సిన అవసరం లేకుండా రెన్యువల్స్ ఆన్లైన్లో జరుగుతాయని అధికారులు తెలిపారు. ప్రతి కంపెనీ, తమకు సొంతంగా ఓ పాస్వర్డ్ని ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ఆ పాస్వర్డ్ ద్వారా ఆన్లైన్లో వలసదారుల రెసిడెన్స్ని రెన్యువల్ చేసుకోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం