మదీనా: హజ్ యాత్రికుల కోసం రెండు కేర్ సెంటర్లు ప్రారంభం
- February 13, 2020
హజ్ యాత్రికులకు వివిధ సేవలు అందించటంతో పాటు యాత్రను మరింత సులభతరం చేసేలా మినిస్ట్రి ఆఫ్ హజ్ అండ్ ఉమ్ర మదీనాలో రెండు కేర్ సెంటర్లను ప్రారంభించింది. సౌదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజన్ 2030లో భాగంగా ఈ రెండు కేర్ సెంటర్లు హజ్ యాత్రకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలను అందించటంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. అల్ బఖ్ లోని ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజిజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఏర్పాటు చేసిన ఈ కేర్ సెంటర్స్ ఒకే చోట 30 రకాల సేవలు పొందే అవకాశాలు ఉన్నాయి. దీంతో యాత్రికులు వివిధ అనుమతుల కోసం వేర్వేరు ఆఫీసులు, ఇతర వ్యక్తులను సంప్రదించాల్సిన చికాకులు ఉండవు. హజ్ లేదా ఉమ్రా ప్యాకేజీలోనే 30 రకాల సేవలు పొందవచ్చు. భక్తులు కేర్ సెంటర్స్ లోనే కావాల్సిన పేపర్ వర్క్ ఫినిష్ చేయవచ్చు. ఇందుకు సెల్ఫ్ సర్వీస్ డివైస్ సాయంతోగానీ, కేర్ సెంటర్ స్టాఫ్ సాయం పొందవచ్చు. కేర్ సెంటర్స్ లో పని చేసే స్టాఫ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ మాట్లాడగలరు. దీంతో భక్తులకు లాంగ్వేజ్ సమస్య కూడా ఉండదు. వేలిముద్రల ద్వారా కూడా యాత్రికులు తమ డేటా యాక్సెస్ చేసుకొవచ్చని మదీనాలోని పాస్ పోర్ట్ డైరెక్టరేట్ జనరల్ వెల్లడించారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!