చావు కబురు చల్లాగా షూటింగ్ ప్రారంభం
- February 13, 2020
గీతాఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారి సమర్పణలో పిల్లా , భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సివాలా, ప్రతిరోజు పండగే లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన జిఏ2 బ్యానర్ పై మరో సన్సేషనల్ చిత్రానికి శ్రీకారం చుట్టారు యంగ్ ఇంటిలిజెంట్ ప్రోడ్యూసర్ బన్నివాసు. ఆర్.ఎక్స్ 100 సినిమాతో నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ హీరోగా , లక్కిబ్యూటి లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కౌశిక్ పెగళ్లపాటి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం చావుకబురు చల్లగా.. ఈరోజు ఫిల్మ్నగర్ దైవసన్నిధానంలో పూజాకార్యక్రమాలతో ఈ చిత్ర షూటింగ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ గారి మనమరాలు బేబి అన్విత క్లాప్ నివ్వగా , స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు ఆయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రానికి మెదటి దర్శకత్వ భాద్యతని అల్లు అరవింద్ గారు నిర్వహించారు. ఈ చిత్రం లో హీరో కార్తికేయ బస్తి బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.. అలాగే ప్రముఖ కెమెరామెన్ సునిల్ రెడ్డి తన సినిమాటొగ్రఫి ని అందిస్తున్నారు, ఎడిటర్ గా సత్య, ప్రోడక్షన్ డిజైనర్ మనీషా ఏ దత్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ గా రాఘవ కరుటూరి లు బాద్యతలు నిర్వహిస్తున్నారు. ఈనెల 19 నుండి ఈ చిత్రం షూటింగ్ జరుకుంటుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు..
ఈ చిత్రంలో నటీనటులు.. కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్, భద్రం తదితరులు నటిస్తున్నారు..
బ్యానర్ : GA2 pictures
సమర్పణ : అల్లు అరవింద్
సంగీతం.. జేక్స్ బిజోయ్
కెమెరా.. సునీల్ రెడ్డి,
ప్రోడక్షన్ డిజైనర్.. మనీషా ఏ దత్
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్.. రాఘవ కరుటూరి
ఎడిటర్.. సత్య
పి ఆర్ ఒ.. ఏలూరు శ్రీను
నిర్మాత : బన్నీ వాసు
డైరెక్టర్ : కౌశిక్ పెగళ్లపాటి
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







