ఆమాద్మీ పార్టీ సంచలన నిర్ణయం..ప్రమాణ స్వీకారోత్సవానికి వాళ్ళెవ్వరు రారట
- February 13, 2020
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీ మరోసారి తిరుగులేని విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని కేవలం ఢిల్లీ ప్రజల మధ్యే ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించారు. దీంతో ఈసారి ఇతర రాష్ట్రాలకు చెందిన సీఎంలు, రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానం పంపడం లేదు. ఈ మేరకు ఆమాద్మీ పార్టీ ఢిల్లీ విభాగం కన్వీనర్ గోపాల్ రాయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ''ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులెవరికీ ఆహ్వానం పంపడం లేదు. కేవలం ఢిల్లీ ప్రజల సమక్షంలో మాత్రమే ఈ కార్యక్రమం జరగనుంది...'' అని ఆయన తెలిపారు.
తన నాయకత్వంపై నమ్మకం ఉంచి మళ్లీ అధికారం కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలతో కలిసి కేజ్రీవాల్ ప్రమాణం చేయనున్నట్టు రాయ్ పేర్కొన్నారు. ఈ నెల 16 ఆదివారం ఢిల్లీలోని ప్రఖ్యాత రామ్ లీలా మైదానం వేదికగా ఆయన ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణం చేయడం ఇది మూడోసారి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ ఆమాద్మీ పార్టీ 62 స్థానాలు కైవసం చేసుకుంది. మిగతా ఎనిమిది స్థానాలు బీజేపీకి దక్కగా.. కాంగ్రెస్ పార్టీకి ఒక్కచోట కూడా విజయం దక్కలేదు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!