సుష్మా స్వరాజ్ కు ఘన నివాళి
- February 13, 2020
సుష్మా స్వరాజ్...పరిచయం అవసరం లేని ఒక మహా మనిషి..ఆమె పేరు విన్నవెంటనే ఎందరినో ఆదుకున్న మమకారపు హృదయం గుర్తుకొస్తుంది. ఫిబ్రవరి 14 సుష్మ స్వరాజ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక పరకటం చేసింది భారత ప్రభుత్వం..వివరాలు ఇలా..
మాజీ విదేశాంగ మంత్రి దివంగత శ్రీమతి సుష్మా స్వరాజ్ యొక్క భారత దౌత్య, ప్రజా సేవ మరియు అమూల్యమైన కృషికి గుర్తుగా న్యూ ఢిల్లీ లోని 'ప్రవాసీ భారతీయ కేంద్రం' ను 'సుష్మా స్వరాజ్ భవన్' గా మరియు 'ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్' ను 'సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్' గా మారుస్తూ ఆమెకు ఘన నివాళి అందించింది భారత ప్రభుత్వం.
ప్రధాని మోదీ తొలి కేబినెట్లో సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా పని చేశారు. ఇందిరా గాంధీ తర్వాత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రెండో మహిళగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. 1998లో కొద్ది రోజులపాటు ఢిల్లీ సీఎంగానూ ఆమె పని చేశారు. మోదీ కేబినెట్లో విదేశాంగ మంత్రిగా ఆమె విశేష సేవలు అందించారు. ఆ పదవికి ఆమె వన్నె తీసుకొచ్చారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి వెనక్కి రప్పించడంలో, పాకిస్థానీయులకు మెడికల్ వీసాలు అందజేయడంలో ఆమె చొరవ చూపారు. నిత్యం ట్విట్టర్లో అందుబాటులో ఉంటూ.. సామాన్యుడి మంత్రిగా అనిపించుకున్నారు. పార్టీలకు అతీతంగా ఆమె వ్యవహరించారు.
తెలంగాణతోనూ ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆమె పార్లమెంట్లో తెలంగా గొంతుకను బలంగా వినిపించారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆమెను తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకుంటారు. 2017 చివర్లో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో మాట్లాడిన ఆమె.. ‘‘నేను మీ తెలంగాణ చిన్నమ్మను’’ అనగానే.. సభ చప్పట్లతో మార్మోగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







