బహ్రెయిన్:లంచం డిమాండ్ చేసిన పబ్లిక్ ఎంప్లాయ్ కి జైలు శిక్ష
- February 15, 2020
బహ్రెయిన్:ప్రజలకు సర్వీస్ అందించాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయ్ డబ్బు కక్కుర్తి అతన్ని జైలు పాలు చేసింది. ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ నుంచి లంచం డిమాండ్ చేసిన కేసులో హై క్రిమినల్
కోర్టు ఆ ఎంప్లాయ్ కి జైలు శిక్ష విధించింది. కోర్టు రికార్డ్స్ తెలిపిన వివరాల ప్రకారం ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ మినిస్ట్రి ఆఫ్ వర్క్స్ తో ముందస్తుగా చేసుకున్న ఒప్పందం మేరకు లైట్స్ ను ఏర్పాటు చేసింది. అయితే..ఒప్పందంలో పేర్కొన్న విధంగా పనులు చేయాలంటే BD18,000 ఖర్చు అవుతుంది. దీంతో తక్కువ ఖర్చులో నాసిరకంగా పనులు పూర్తి చేసింది. నిబంధనలు ఉల్లంఘించటంతో మినిస్ట్రి ఆఫ్ వర్క్స్ ఎంప్లాయ్ లో పని చేస్తున్న నిందితుడు సదరు కన్ స్ట్రక్షన్ కంపెనీపై చర్యలు తీసుకుంటానని బెదిరించాడు. చర్యలు తీసుకోకుండా ఉండాలంటే లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. అయితే..ఆ కన్ స్ట్రక్షన్ కంపెనీ ఉన్నతాధికారులను సంప్రదించింది. దీంతో వలపన్నిన ఉన్నతాధికారులు లంచం తీసుకుటుండగా ఎంప్లాయ్ ని అరెస్ట్ చేశారు. కోర్టులో నేరం రుజువు కావటంతో హై క్రిమినల్ కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







