బహ్రెయిన్:లంచం డిమాండ్ చేసిన పబ్లిక్ ఎంప్లాయ్ కి జైలు శిక్ష

- February 15, 2020 , by Maagulf
బహ్రెయిన్:లంచం డిమాండ్ చేసిన పబ్లిక్ ఎంప్లాయ్ కి జైలు శిక్ష

బహ్రెయిన్:ప్రజలకు సర్వీస్ అందించాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయ్ డబ్బు కక్కుర్తి అతన్ని జైలు పాలు చేసింది. ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ నుంచి లంచం డిమాండ్ చేసిన కేసులో హై క్రిమినల్

కోర్టు ఆ ఎంప్లాయ్ కి జైలు శిక్ష విధించింది. కోర్టు రికార్డ్స్ తెలిపిన వివరాల ప్రకారం ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ మినిస్ట్రి ఆఫ్ వర్క్స్ తో ముందస్తుగా చేసుకున్న ఒప్పందం మేరకు లైట్స్ ను ఏర్పాటు చేసింది. అయితే..ఒప్పందంలో పేర్కొన్న విధంగా పనులు చేయాలంటే BD18,000 ఖర్చు అవుతుంది. దీంతో తక్కువ ఖర్చులో నాసిరకంగా పనులు పూర్తి చేసింది. నిబంధనలు ఉల్లంఘించటంతో మినిస్ట్రి ఆఫ్ వర్క్స్ ఎంప్లాయ్ లో పని చేస్తున్న నిందితుడు సదరు కన్ స్ట్రక్షన్ కంపెనీపై చర్యలు తీసుకుంటానని బెదిరించాడు. చర్యలు తీసుకోకుండా ఉండాలంటే లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. అయితే..ఆ కన్ స్ట్రక్షన్ కంపెనీ ఉన్నతాధికారులను సంప్రదించింది. దీంతో వలపన్నిన ఉన్నతాధికారులు లంచం తీసుకుటుండగా ఎంప్లాయ్ ని అరెస్ట్ చేశారు. కోర్టులో నేరం రుజువు కావటంతో హై క్రిమినల్ కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com