దుబాయ్:అదిరిపోయే ఫీచర్స్ 5జీ టెక్నాలజీ పోలీస్ పాట్రోలింగ్ కారు
- February 15, 2020
దుబాయ్:ప్రజలకు భద్రత అందించటంలో ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న దుబాయ్..పాట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. ఇందుకోసం అదిరిపోయే ఫీచర్స్ తో 5జీ టెక్నాలజీ ఫస్ట్ పెట్రోలింగ్ కారును దుబాయ్ పోలీసులకు అందుబాటులోకి తెచ్చింది. ఎతిసలాట్ కోఆపరేషన్ తో ఈ స్మార్ట్ పెట్రోలింగ్ కారును అధికారికంగా ప్రారంభించింది. దీంతో మిడిల్ ఈస్ట్, నార్త్ అఫ్రికా రిజీయన్ లో పెట్రోలింగ్ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. ఇందులో ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాలు 5జీ టెక్నాలజీ ద్వారా నేరుగా కమాండ్ కంట్రోల్ కు కనెక్ట్ చేయబడ్డాయి. దుబాయ్ పోలీసులు 5జీ సర్వీస్ గోల్ సాధించేందుకు ఎంతగానో కృషి చేయాల్సి వచ్చిందని బ్రిగేడియర్ ఖలేద్ నాస్సేర్ అల్ రజూఖీ తెలిపారు. 5జీ టెక్నాలజీతో నేరాల అదుపులో పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యే అవకాశాలు మరింత మెరుగుపడతాయని వివరించారు. పెట్రోలింగ్ కారులో అమర్చిన కెమెరాలు అత్యాధునికమైనవని, హై రెసెల్యూషన్ తో విజువల్స్ ను కమాండ్ కంట్రోల్ రూంకు పంపించ వచ్చన్నారు. అలాగే ఫేస్ రికగ్నైజేషన్ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ ఫీచర్స్ తో ఎమిరాతి ప్రజలకు మరింత భద్రత కల్పించవచ్చన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







