దుబాయ్:అదిరిపోయే ఫీచర్స్ 5జీ టెక్నాలజీ పోలీస్ పాట్రోలింగ్ కారు
- February 15, 2020
దుబాయ్:ప్రజలకు భద్రత అందించటంలో ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న దుబాయ్..పాట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. ఇందుకోసం అదిరిపోయే ఫీచర్స్ తో 5జీ టెక్నాలజీ ఫస్ట్ పెట్రోలింగ్ కారును దుబాయ్ పోలీసులకు అందుబాటులోకి తెచ్చింది. ఎతిసలాట్ కోఆపరేషన్ తో ఈ స్మార్ట్ పెట్రోలింగ్ కారును అధికారికంగా ప్రారంభించింది. దీంతో మిడిల్ ఈస్ట్, నార్త్ అఫ్రికా రిజీయన్ లో పెట్రోలింగ్ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. ఇందులో ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాలు 5జీ టెక్నాలజీ ద్వారా నేరుగా కమాండ్ కంట్రోల్ కు కనెక్ట్ చేయబడ్డాయి. దుబాయ్ పోలీసులు 5జీ సర్వీస్ గోల్ సాధించేందుకు ఎంతగానో కృషి చేయాల్సి వచ్చిందని బ్రిగేడియర్ ఖలేద్ నాస్సేర్ అల్ రజూఖీ తెలిపారు. 5జీ టెక్నాలజీతో నేరాల అదుపులో పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యే అవకాశాలు మరింత మెరుగుపడతాయని వివరించారు. పెట్రోలింగ్ కారులో అమర్చిన కెమెరాలు అత్యాధునికమైనవని, హై రెసెల్యూషన్ తో విజువల్స్ ను కమాండ్ కంట్రోల్ రూంకు పంపించ వచ్చన్నారు. అలాగే ఫేస్ రికగ్నైజేషన్ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ ఫీచర్స్ తో ఎమిరాతి ప్రజలకు మరింత భద్రత కల్పించవచ్చన్నారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







