డెబిట్ కార్డ్ స్కామ్: జీతాల్ని కోల్పోయిన కార్మికులు
- February 15, 2020
రస్ అల్ ఖైమా:ముగ్గురు ఆసియా జాతీయులు, రస్ అల్ ఖైమా మిస్డెమీనర్ కోర్టులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. తమ డెబిట్ కార్డులపై పూర్తి అవగాహన లేని కార్మికుల్ని నిందితులు మోసం చేసినట్లు కోర్డు రికార్డులు చెబుతున్నాయి. రస్ అల్ ఖైమా పోలీస్ స్టేషన్లో పలువురు కార్మికులు, తమ ఖాతాల్లోని జీతం మాయమైనట్లు ఫిర్యాదు చేయడంతో పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడమెలాగో తమకు తెలియదనీ, ఓ వ్యక్తి ఏటీఎం సెంటర్ బయట నిల్చుని, తమకు సాయం చేస్తానన్నాడనీ, అతన్ని నమ్మి మోసపోయామని బాధితులు చెప్పారు. ఏటీఎం కేంద్రాల్లోని సర్వైలెన్స్ కెమెరాలను పరిశీలించిన పోలీసులు, నిందితుల ఆచూకీని కనుగొన్నారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







