డెబిట్ కార్డ్ స్కామ్: జీతాల్ని కోల్పోయిన కార్మికులు
- February 15, 2020
రస్ అల్ ఖైమా:ముగ్గురు ఆసియా జాతీయులు, రస్ అల్ ఖైమా మిస్డెమీనర్ కోర్టులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. తమ డెబిట్ కార్డులపై పూర్తి అవగాహన లేని కార్మికుల్ని నిందితులు మోసం చేసినట్లు కోర్డు రికార్డులు చెబుతున్నాయి. రస్ అల్ ఖైమా పోలీస్ స్టేషన్లో పలువురు కార్మికులు, తమ ఖాతాల్లోని జీతం మాయమైనట్లు ఫిర్యాదు చేయడంతో పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడమెలాగో తమకు తెలియదనీ, ఓ వ్యక్తి ఏటీఎం సెంటర్ బయట నిల్చుని, తమకు సాయం చేస్తానన్నాడనీ, అతన్ని నమ్మి మోసపోయామని బాధితులు చెప్పారు. ఏటీఎం కేంద్రాల్లోని సర్వైలెన్స్ కెమెరాలను పరిశీలించిన పోలీసులు, నిందితుల ఆచూకీని కనుగొన్నారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







