డెబిట్‌ కార్డ్‌ స్కామ్: జీతాల్ని కోల్పోయిన కార్మికులు

- February 15, 2020 , by Maagulf
డెబిట్‌ కార్డ్‌ స్కామ్: జీతాల్ని కోల్పోయిన కార్మికులు

రస్‌ అల్‌ ఖైమా:ముగ్గురు ఆసియా జాతీయులు, రస్‌ అల్‌ ఖైమా మిస్‌డెమీనర్‌ కోర్టులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. తమ డెబిట్‌ కార్డులపై పూర్తి అవగాహన లేని కార్మికుల్ని నిందితులు మోసం చేసినట్లు కోర్డు రికార్డులు చెబుతున్నాయి. రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ స్టేషన్‌లో పలువురు కార్మికులు, తమ ఖాతాల్లోని జీతం మాయమైనట్లు ఫిర్యాదు చేయడంతో పోలీస్‌ అధికారులు విచారణ ప్రారంభించారు. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడమెలాగో తమకు తెలియదనీ, ఓ వ్యక్తి ఏటీఎం సెంటర్‌ బయట నిల్చుని, తమకు సాయం చేస్తానన్నాడనీ, అతన్ని నమ్మి మోసపోయామని బాధితులు చెప్పారు. ఏటీఎం కేంద్రాల్లోని సర్వైలెన్స్‌ కెమెరాలను పరిశీలించిన పోలీసులు, నిందితుల ఆచూకీని కనుగొన్నారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com