కేరళ ప్రభుత్వం నిశాగాంధీ అవార్డును ఇళయరాజాకు ప్రదానం..

- January 21, 2016 , by Maagulf
కేరళ ప్రభుత్వం నిశాగాంధీ అవార్డును  ఇళయరాజాకు ప్రదానం..

 ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కేరళ ప్రభుత్వం నిశాగాంధీ పురస్కారం అందజేసింది. కేరళ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో తిరువనంతపురంలో బుధవారం నిశాగాంధీ డ్యాన్స్‌ అండ్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద రూ. 1,50,000 నగదు అందజేశారు. ఈ సందర్భంగా మ్యూజిక్‌ అకాడమీ ఏర్పాటు కోసం ఇళయరాజాకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు ఉమెన్‌చాందీ ప్రకటించారు. అకాడమీ ఏర్పాటుచేసి వందలాది మంది ఇళయరాజాలను తయారుచేస్తానని ఈ సందర్భంగా ఇళయరాజా పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com