కేరళ ప్రభుత్వం నిశాగాంధీ అవార్డును ఇళయరాజాకు ప్రదానం..
- January 21, 2016
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కేరళ ప్రభుత్వం నిశాగాంధీ పురస్కారం అందజేసింది. కేరళ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో తిరువనంతపురంలో బుధవారం నిశాగాంధీ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్చాందీ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద రూ. 1,50,000 నగదు అందజేశారు. ఈ సందర్భంగా మ్యూజిక్ అకాడమీ ఏర్పాటు కోసం ఇళయరాజాకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు ఉమెన్చాందీ ప్రకటించారు. అకాడమీ ఏర్పాటుచేసి వందలాది మంది ఇళయరాజాలను తయారుచేస్తానని ఈ సందర్భంగా ఇళయరాజా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







