వాట్సాప్ ఇకపై ఫ్రీ ఫ్రీ ఫ్రీ
- January 21, 2016
యూఏఈలోని వాట్సాప్ వినియోగదారులు 'వాట్సాప్ ఇకపై ఉచితం' అనే మెసేజెస్ని అందుకుంటున్నారు. వివిధ దేశాల్లో వాట్సాప్ వినియోగదారుల నుంచి నామమాత్రంగా రుసుముని వసూలు చేస్తోంది. కొన్ని దేశాల్లో మాత్రం వాట్సాప్ సేవలు పూర్తిగా ఉచితం. ఇంకొన్ని దేశాల్లో తొలి ఏడాది ఉచితం, ఆ తర్వాత రుసులు వసూలు చేయాలనుకుంది. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఆన్లైన్ పేమెంట్ వంటి వాటి పట్ల అవగాహన లేని వాట్సాప్ వినియోగదారులు ఇబ్బంది కూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ వర్గాలు వెల్లడించాయి. 3.64 దిర్హామ్లు లేదా 99 సెంట్లు వాట్సాప్ వసూలు చేస్తోంది రుసుముకింద. వాట్సాప్ని ఫేస్బుక్ 19 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నా, వాట్సాప్ నుంచి 20 మిలియన్ డాలర్లు మాత్రమే సబ్స్క్రిప్షన్స్ రూపంలో పొందగలిగింది. వాట్సాప్లో మరిన్ని టూల్స్ని డెవలప్ చేస్తున్నామనీ, బ్యాంకింగ్ సహా పలు రంగాలు వినియోగించుకునేందుకు వీలుగా, వినియోగదారులకు మరింత చేరువయ్యేలా కొత్త ఆప్షన్స్ పొందు పర్చామనీ యాజమాన్యం చెబుతోంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







