గత ఏడాది రెడ్ లైట్ సంకేతాన్ని23,214 మంది ఉల్లంఘన
- January 21, 2016
ఎర్రరంగు కాంతి సంకేతాన్ని దాటి ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనకు పాల్పడినవారు గత ఏడాదితో సరి పోల్చితే, 2015 లో ఆ సంఖ్య క్రమేపి తగ్గుముఖం పడుతుందని షార్జా పోలీసులు మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు, 2014లో ఈ ఉల్లంఘనలు 26,619 ఉండగా, 2015 లో అవి 23,214 గా నమోదయ్యాయి. ఎర్రరంగు కాంతి సంకేతాన్ని అతిక్రమించేవారు రెండు రకాలైన జరిమానాలు చెల్లించాలి అనే ట్రాఫిక్ నిబంధన అత్యధికులను కట్టడి చేసిందని చెప్పవచ్చు. ఇందులో మొదటిది ' సిగ్నెల్ జంపింగ్ ' కింద 800 దినార్లను చెల్లించాలి. ఆ అతిక్రమణకు గాను ఆయా వాహనాన్ని 15 రోజుల పాటు తమ ఆధీనంలోనే పోలీసులు ఉంచుకొంటారు. ఆ తర్వాత వాహనదారుడు అతి వేగంగా ఆ రోజు వాహనాన్ని నడిపినందుకు రెండవ దఫా జరిమానా వడ్డింపును గుర్తు చేసుకొని మరీ విధిస్తారు, దీంతో వేగంగా దూసుకుపోయే డ్రైవర్ బాబులు తప్పక తమ జోరు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014 లో ఎక్కువగా నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనలలో అతి వేగంగా వాహనాన్ని నడపడం, ముఖ్య కూడళ్ళలో ఎరుపు రంగు దీపాలు తమ కాంతి మార్చుకొనే లోపున రెప్పపాటులోతమ వాహనాన్ని ట్రాఫిక్ రద్దీలో పరుగు పెట్టించిన వారే అధికులు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









