గత ఏడాది రెడ్ లైట్ సంకేతాన్ని23,214 మంది ఉల్లంఘన
- January 21, 2016
ఎర్రరంగు కాంతి సంకేతాన్ని దాటి ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనకు పాల్పడినవారు గత ఏడాదితో సరి పోల్చితే, 2015 లో ఆ సంఖ్య క్రమేపి తగ్గుముఖం పడుతుందని షార్జా పోలీసులు మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు, 2014లో ఈ ఉల్లంఘనలు 26,619 ఉండగా, 2015 లో అవి 23,214 గా నమోదయ్యాయి. ఎర్రరంగు కాంతి సంకేతాన్ని అతిక్రమించేవారు రెండు రకాలైన జరిమానాలు చెల్లించాలి అనే ట్రాఫిక్ నిబంధన అత్యధికులను కట్టడి చేసిందని చెప్పవచ్చు. ఇందులో మొదటిది ' సిగ్నెల్ జంపింగ్ ' కింద 800 దినార్లను చెల్లించాలి. ఆ అతిక్రమణకు గాను ఆయా వాహనాన్ని 15 రోజుల పాటు తమ ఆధీనంలోనే పోలీసులు ఉంచుకొంటారు. ఆ తర్వాత వాహనదారుడు అతి వేగంగా ఆ రోజు వాహనాన్ని నడిపినందుకు రెండవ దఫా జరిమానా వడ్డింపును గుర్తు చేసుకొని మరీ విధిస్తారు, దీంతో వేగంగా దూసుకుపోయే డ్రైవర్ బాబులు తప్పక తమ జోరు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014 లో ఎక్కువగా నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనలలో అతి వేగంగా వాహనాన్ని నడపడం, ముఖ్య కూడళ్ళలో ఎరుపు రంగు దీపాలు తమ కాంతి మార్చుకొనే లోపున రెప్పపాటులోతమ వాహనాన్ని ట్రాఫిక్ రద్దీలో పరుగు పెట్టించిన వారే అధికులు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







