గత ఏడాది రెడ్ లైట్ సంకేతాన్ని23,214 మంది ఉల్లంఘన

- January 21, 2016 , by Maagulf
గత ఏడాది రెడ్ లైట్ సంకేతాన్ని23,214 మంది ఉల్లంఘన

ఎర్రరంగు కాంతి సంకేతాన్ని దాటి  ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనకు పాల్పడినవారు గత ఏడాదితో సరి పోల్చితే, 2015 లో ఆ సంఖ్య క్రమేపి తగ్గుముఖం పడుతుందని షార్జా పోలీసులు మంగళవారం ఒక  పత్రికా ప్రకటనలో తెలిపారు, 2014లో ఈ  ఉల్లంఘనలు 26,619 ఉండగా, 2015 లో అవి 23,214 గా నమోదయ్యాయి. ఎర్రరంగు కాంతి సంకేతాన్ని అతిక్రమించేవారు రెండు రకాలైన జరిమానాలు చెల్లించాలి అనే  ట్రాఫిక్ నిబంధన అత్యధికులను కట్టడి చేసిందని చెప్పవచ్చు. ఇందులో మొదటిది ' సిగ్నెల్ జంపింగ్ ' కింద 800 దినార్లను చెల్లించాలి. ఆ అతిక్రమణకు గాను ఆయా వాహనాన్ని 15 రోజుల పాటు  తమ ఆధీనంలోనే పోలీసులు ఉంచుకొంటారు. ఆ తర్వాత వాహనదారుడు అతి వేగంగా ఆ రోజు  వాహనాన్ని నడిపినందుకు రెండవ దఫా జరిమానా వడ్డింపును గుర్తు చేసుకొని మరీ విధిస్తారు, దీంతో  వేగంగా దూసుకుపోయే డ్రైవర్ బాబులు  తప్పక తమ జోరు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014 లో  ఎక్కువగా నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనలలో అతి వేగంగా వాహనాన్ని నడపడం, ముఖ్య కూడళ్ళలో ఎరుపు రంగు దీపాలు తమ కాంతి మార్చుకొనే లోపున రెప్పపాటులోతమ వాహనాన్ని ట్రాఫిక్ రద్దీలో పరుగు పెట్టించిన వారే అధికులు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com