రియాద్:గుడువుకు ముందే ముఖీమ్ ఐడీ కార్డ్స్ రెన్యూవల్ చేసుకోవాలంటున్న అధికారులు
- February 18, 2020సౌదీలోని ప్రవాసులు అందరు తమ ముకీమ్ ఐడెంటిటీ కార్డుల గడువు ముగియడానికి కనీసం మూడు రోజుల ముందే కార్డును రెన్యువల్ చేయించుకోవాలని డైరెక్టరేట్ జనరల్
ఆఫ్ పాస్ పోర్ట్స్ (జవజత్) ప్రకటించింది. డైరెక్టరేట్ యొక్క నిబంధనలు మరియు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని జావాజాత్ గుర్తు చేసింది. ముకీమ్ ఐడెంటీటి కార్డుల రెన్యూవల్ విషయంలో అలక్ష్యంగా వ్యవహరించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. జరిమానాతో పాటు దేశబహిష్కరణ విధించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది. రెన్యూవల్ నిబంధనను ఉల్లంఘించిన ప్రవాసీయులకు తొలి తప్పుగా SR500 జరిమానా విధిస్తారు. రెండోసారి రిపీట్ అయితే.. SR1,000 ఫైన్ వేస్తారు. మూడో సారి మాత్రం దేశం నుంచి బహిరించనున్నట్లు స్పష్టం చేసింది. ముకీమ్ ఐడెంటీటి కార్డు హోల్డర్ తన రెసిడెన్స్ పర్మిట్ వాలిడిటీ పిరియడ్ ను కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సర్వీసెస్ అబ్షర్ లో లాగిన అవటం ద్వారాగాని..ముకీమ్ ఈ పోర్ట్ ద్వారా గానీ వివరాలను పొందవచ్చని జావజత్ తెలిపింది.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్