రియాద్:గుడువుకు ముందే ముఖీమ్ ఐడీ కార్డ్స్ రెన్యూవల్ చేసుకోవాలంటున్న అధికారులు
- February 18, 2020
సౌదీలోని ప్రవాసులు అందరు తమ ముకీమ్ ఐడెంటిటీ కార్డుల గడువు ముగియడానికి కనీసం మూడు రోజుల ముందే కార్డును రెన్యువల్ చేయించుకోవాలని డైరెక్టరేట్ జనరల్
ఆఫ్ పాస్ పోర్ట్స్ (జవజత్) ప్రకటించింది. డైరెక్టరేట్ యొక్క నిబంధనలు మరియు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని జావాజాత్ గుర్తు చేసింది. ముకీమ్ ఐడెంటీటి కార్డుల రెన్యూవల్ విషయంలో అలక్ష్యంగా వ్యవహరించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. జరిమానాతో పాటు దేశబహిష్కరణ విధించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది. రెన్యూవల్ నిబంధనను ఉల్లంఘించిన ప్రవాసీయులకు తొలి తప్పుగా SR500 జరిమానా విధిస్తారు. రెండోసారి రిపీట్ అయితే.. SR1,000 ఫైన్ వేస్తారు. మూడో సారి మాత్రం దేశం నుంచి బహిరించనున్నట్లు స్పష్టం చేసింది. ముకీమ్ ఐడెంటీటి కార్డు హోల్డర్ తన రెసిడెన్స్ పర్మిట్ వాలిడిటీ పిరియడ్ ను కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సర్వీసెస్ అబ్షర్ లో లాగిన అవటం ద్వారాగాని..ముకీమ్ ఈ పోర్ట్ ద్వారా గానీ వివరాలను పొందవచ్చని జావజత్ తెలిపింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







