రియాద్:గుడువుకు ముందే ముఖీమ్ ఐడీ కార్డ్స్ రెన్యూవల్ చేసుకోవాలంటున్న అధికారులు
- February 18, 2020
సౌదీలోని ప్రవాసులు అందరు తమ ముకీమ్ ఐడెంటిటీ కార్డుల గడువు ముగియడానికి కనీసం మూడు రోజుల ముందే కార్డును రెన్యువల్ చేయించుకోవాలని డైరెక్టరేట్ జనరల్
ఆఫ్ పాస్ పోర్ట్స్ (జవజత్) ప్రకటించింది. డైరెక్టరేట్ యొక్క నిబంధనలు మరియు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని జావాజాత్ గుర్తు చేసింది. ముకీమ్ ఐడెంటీటి కార్డుల రెన్యూవల్ విషయంలో అలక్ష్యంగా వ్యవహరించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. జరిమానాతో పాటు దేశబహిష్కరణ విధించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది. రెన్యూవల్ నిబంధనను ఉల్లంఘించిన ప్రవాసీయులకు తొలి తప్పుగా SR500 జరిమానా విధిస్తారు. రెండోసారి రిపీట్ అయితే.. SR1,000 ఫైన్ వేస్తారు. మూడో సారి మాత్రం దేశం నుంచి బహిరించనున్నట్లు స్పష్టం చేసింది. ముకీమ్ ఐడెంటీటి కార్డు హోల్డర్ తన రెసిడెన్స్ పర్మిట్ వాలిడిటీ పిరియడ్ ను కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సర్వీసెస్ అబ్షర్ లో లాగిన అవటం ద్వారాగాని..ముకీమ్ ఈ పోర్ట్ ద్వారా గానీ వివరాలను పొందవచ్చని జావజత్ తెలిపింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!