రియాద్:గుడువుకు ముందే ముఖీమ్ ఐడీ కార్డ్స్ రెన్యూవల్ చేసుకోవాలంటున్న అధికారులు
- February 18, 2020సౌదీలోని ప్రవాసులు అందరు తమ ముకీమ్ ఐడెంటిటీ కార్డుల గడువు ముగియడానికి కనీసం మూడు రోజుల ముందే కార్డును రెన్యువల్ చేయించుకోవాలని డైరెక్టరేట్ జనరల్
ఆఫ్ పాస్ పోర్ట్స్ (జవజత్) ప్రకటించింది. డైరెక్టరేట్ యొక్క నిబంధనలు మరియు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని జావాజాత్ గుర్తు చేసింది. ముకీమ్ ఐడెంటీటి కార్డుల రెన్యూవల్ విషయంలో అలక్ష్యంగా వ్యవహరించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. జరిమానాతో పాటు దేశబహిష్కరణ విధించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది. రెన్యూవల్ నిబంధనను ఉల్లంఘించిన ప్రవాసీయులకు తొలి తప్పుగా SR500 జరిమానా విధిస్తారు. రెండోసారి రిపీట్ అయితే.. SR1,000 ఫైన్ వేస్తారు. మూడో సారి మాత్రం దేశం నుంచి బహిరించనున్నట్లు స్పష్టం చేసింది. ముకీమ్ ఐడెంటీటి కార్డు హోల్డర్ తన రెసిడెన్స్ పర్మిట్ వాలిడిటీ పిరియడ్ ను కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సర్వీసెస్ అబ్షర్ లో లాగిన అవటం ద్వారాగాని..ముకీమ్ ఈ పోర్ట్ ద్వారా గానీ వివరాలను పొందవచ్చని జావజత్ తెలిపింది.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం