కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో ప్రాణాలు కోల్పోయిన భారత వలసదారుడు

- February 18, 2020 , by Maagulf
కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో ప్రాణాలు కోల్పోయిన భారత వలసదారుడు

భారతదేశం నుంచి వచ్చిన ఓ వలసదారుడు, దుబాయ్‌లోని ఓ కన్‌స్ట్రక్షన్‌ సైట్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడ్ని కేరళకు చెందిన రహ్మాన్‌గా గుర్తించారు. దుబాయ్‌లో ప్లానింగ్‌ ఇంజనీర్‌గా రెహ్మాన్‌ పనిచేస్తున్నట్లు సోషల్‌ వర్కర్‌ నజీర్‌ వటనపల్లి చెప్పారు. మృతదేహాన్ని ఇండియాకి పంపించేందుకోసం రహ్మాన్‌ కుటుంబ సభ్యులకు వటనపల్లి సహకరిస్తున్నారు. భవనంపైకి రెహ్మాన్‌ ఎందుకు వెళ్ళారన్నది తెలియరాలేదనీ, ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని వటనపల్లి చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com