మస్కట్:ప్రవాసీయులను పెళ్లి చేసుకున్న ఒమనీ మహిళల పిల్లలకు ట్యూషన్ ఫీజు మినహాయింపు
- February 18, 2020
మస్కట్:ప్రవాసీయులను వివాహం చేసుకున్న ఒమనీ మహిళల విన్నపాన్ని ఒమన్ మినిస్ట్రి ఎడ్యూకేషన్ మన్నించింది. ఇక నుంచి వారి పిల్లలకు ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఒమనీ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ సిఫార్సుల మేరకు విద్యా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఒమన్ మినిస్ట్రి విడుదల చేసిన డిక్రి నెంబర్ 34/2018 ప్రకారం ఒమనీయేతర విద్యార్ధులకు ట్యూషన్ ఫీజు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రవాసీయులను పెళ్లాడిన ఒమనీ మహిళలు తమ పిల్లలను డిగ్రీ నెంబర్ 34/2018 నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి విన్నపాలపై పర్యవేక్షించిన ఒమనీ కమిషన్ పలుమార్లు మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ అధికారులతో చర్చించింది. ప్రాథమిక హక్కుల చట్టం, బాలల హక్కుల చట్టం మేరకు ఫీజు నుంచి మినహాయించాలని ఒమనీ కమిషన్ నివేదిక సమర్పించింది. కమిషన్ సిఫార్సులను పరిశీలించిన విద్యామంత్రిత్వ శాఖ ప్రవాసీయులను వివాహం చేసుకన్న ఒమన మహిళల పిల్లలకు ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







