ట్రంప్ పుణ్యమా అని 'యమున' కు కొత్త పుంతలు
- February 19, 2020
ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భారత పర్యటనలో యూపీలోని తాజ్ మహల్ను సందర్శించనున్నారు. ఈ నేపధ్యంలో తాజ్మహల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజ్మహల్కు ఒకవైపున యమనానది ప్రవహిస్తుంటుంది. ఈ నదిలో కలుషితమైన నీరు ప్రవహిస్తుందనే విషయం విదితమే. అదేవిధంగా యమునా నది నీటి నుంచి వచ్చే దుర్వాసన కారణంగా స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారు. అయితే ట్రంప్ వచ్చే సమయంలో యమునా నది నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందుకోసం బులంద్ షహర్లోని గంగా నది నుంచి 500 క్యూసెక్కుల నీటిని యమునా నదిలోకి విడిచిపెట్టనున్నారు. ఫలితంగా యమునా నది చక్కగా పారుతున్నట్లు కనిపిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా యమునలో ప్రవాహం పెరిగితే దుర్వాసన అంతగా వ్యాపించకుండా ఉంటుందని అనుకుంటున్నారు. భారత్లో ట్రంప్ ఈనెల 23 నుంచి 26 వరకూ పర్యటించనున్నారు. అధిక సమయం ఢిల్లీలోనే గడపనున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







