నోరు జారటంతో నెటిజన్ల చేతిలో ట్రోల్ అవుతున్న కిషన్ రెడ్డి
- February 19, 2020కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. అనుకోకుండా నెటిజన్ల చేతిలో బుక్కైపోయారు. తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేటాయింపులపై టీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టబోయి.. కాస్త పట్టు తప్పి మాట్లాడారు. హైదరాబాద్ లో చర్లపల్లి శాటిలైట్ రైల్వే స్టేషన్ కు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో.. ట్రోలింగ్ కు గురవుతున్నారు.
"ఎర్రబస్సు మాత్రమే తెలిసిన తెలంగాణకు.. మోడీ ప్రభుత్వం వచ్చాకే అనేక రైళ్లు వచ్చాయి" అని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ కామెంట్లపై తీవ్రంగా స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణకు తొలి రైలు తెచ్చిన మోడీకి కృతజ్ఞతలు అని కొందరు వెటకారం చేస్తుంటే.. రాష్ట్ర ప్రజలను అవమానించారంటూ.. మరి కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరి కొందరైతే.. నిజాం కాలంలోనే హైదరాబాద్ లో రైల్వే సర్వీసులు ఉన్నాయని.. ముక్కోటి ఏకాదశి లాంటి పర్వదినాలకు అప్పట్లో నిజాం ప్రభువు టికెట్ ధరల్లో రాయితీ కూడా ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. నాటి గోల్కొండ దిన పత్రిక క్లిప్పింగ్ ను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తించాలని కోరుతున్నారు.
గతంతో పోలిక పెట్టే క్రమంలో ఎర్రబస్సుగాళ్లు అని అర్థం వచ్చేలా కిషన్ రెడ్డి పొరబాటున చేసిన వ్యాఖ్యలు ఇంత దూరం వస్తాయని.. బీజేపీ నేతలు కూడా ఊహించి ఉండకపోవచ్చు.
తాజా వార్తలు
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు