దుబాయ్: డ్రగ్ స్మగ్లింగ్ కేసులో పాకిస్తానీకి పదేళ్ల జైలు శిక్ష
- February 19, 2020
గ్రీన్ టీ బ్యాగ్స్ లో కిలోకు పైగా హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన పాకిస్తానీకి దుబాయ్ క్రిమినల్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే AED 50,000 ఫైన్ విధించింది. శిక్షా
కాలం పూర్తైన తర్వాత దేశం విడిచి వెళ్లాల్సిందిగా పాకిస్తానీ స్మగ్లర్ ను దుబాయ్ క్రిమినల్ కోర్టు ఆదేశించింది. కోర్టు రికార్డ్స్ ప్రకారం గత ఏడాది నవంబర్ 7న నిందితుడ్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను గ్రీన్ టీ రాపర్స్ లో 1.1 కిలోల హెరాయిన్ నింపి.. టీ బాక్సెస్ నమ్మించబోయాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తెల్లవారుజామున ఫ్లైట్ దిగిన నిందితుడి దగ్గర టీ బాక్సుల లగేజీ ఎక్కువగా ఉండటం ఎయిర్ పోర్టు కస్టమ్స్ అఫీసర్స్ కి అనుమానం కలిగింది. అసాధారణ స్థాయిలో టీ బ్యాక్స్ ఎందుకు తీసుకెళ్తున్నాడనే సందేహంతో అతని లగేజ్ ను కస్టమ్స్ అఫీసర్స్ చెక్ చేశారు. టీ బ్యాగ్స్ రాపర్స్ లో అనుమానిత పౌడర్ ను గుర్తించిన అధికారులు వెంటనే అతన్ని పోలీసులు, యాంటీ డ్రగ్స్ ఫోర్స్ కి అప్పగించారు. ఫోరెన్సిక్ టెస్ట్ తర్వాత హెరాయిన్ అని నిర్ధారణ కావటంతో పాకిస్తానీ స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు. క్రిమినల్ కోర్టులో నేరం రుజువు కావటంతో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే..రెండు వారాల్లో అతను అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







