నోరు జారటంతో నెటిజన్ల చేతిలో ట్రోల్ అవుతున్న కిషన్ రెడ్డి
- February 19, 2020
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. అనుకోకుండా నెటిజన్ల చేతిలో బుక్కైపోయారు. తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేటాయింపులపై టీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టబోయి.. కాస్త పట్టు తప్పి మాట్లాడారు. హైదరాబాద్ లో చర్లపల్లి శాటిలైట్ రైల్వే స్టేషన్ కు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో.. ట్రోలింగ్ కు గురవుతున్నారు.
"ఎర్రబస్సు మాత్రమే తెలిసిన తెలంగాణకు.. మోడీ ప్రభుత్వం వచ్చాకే అనేక రైళ్లు వచ్చాయి" అని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ కామెంట్లపై తీవ్రంగా స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణకు తొలి రైలు తెచ్చిన మోడీకి కృతజ్ఞతలు అని కొందరు వెటకారం చేస్తుంటే.. రాష్ట్ర ప్రజలను అవమానించారంటూ.. మరి కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరి కొందరైతే.. నిజాం కాలంలోనే హైదరాబాద్ లో రైల్వే సర్వీసులు ఉన్నాయని.. ముక్కోటి ఏకాదశి లాంటి పర్వదినాలకు అప్పట్లో నిజాం ప్రభువు టికెట్ ధరల్లో రాయితీ కూడా ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. నాటి గోల్కొండ దిన పత్రిక క్లిప్పింగ్ ను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తించాలని కోరుతున్నారు.
గతంతో పోలిక పెట్టే క్రమంలో ఎర్రబస్సుగాళ్లు అని అర్థం వచ్చేలా కిషన్ రెడ్డి పొరబాటున చేసిన వ్యాఖ్యలు ఇంత దూరం వస్తాయని.. బీజేపీ నేతలు కూడా ఊహించి ఉండకపోవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







