ట్రంప్ విమానం 'ఎయిర్ఫోర్స్ వన్' విశేషాలు
- February 19, 2020ఎయిర్ఫోర్స్ వన్ విశేషాలెన్నో
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత్లో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 24న తన సతీమణి మెలానియాతో కలిసి బోయింగ్ 747-200బీ సిరీస్ విమానంలో దిల్లీకి రానున్నారు. 'ఎయిర్ఫోర్స్ వన్'గా పిలిచే ఈ విమానం ట్రంప్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అమెరికా అధ్యక్షుడిని తీసుకెళ్లే ఈ విమానంలో ఎన్నో విశేషాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 'ఎగిరే శ్వేతసౌధమ'నే అనాలి. ప్రతి విషయంలోనూ ప్రత్యేకత చాటుకునే అమెరికా.. దేశాధ్యక్షుడి విమానాన్ని కూడా అత్యంత అధునాతనంగా, వైభవంగా తీర్చిదిద్దింది. విమానంపై 'United States of America' అక్షరాలు, అమెరికా జాతీయ జెండా, అధ్యక్షుడి ముద్రతో ఉండే ఎయిర్ఫోర్స్ వన్ తనదైన ప్రత్యేకత చాటుతోంది.
ప్రత్యేకతలివే..
ఇతర బోయింగ్ ప్యాసింజర్ విమానాల మాదిరిగా కాకుండా ఎయిర్ఫోర్స్ వన్కు గాల్లోనే ఇంధనం నింపుకొనే సామర్థ్యం ఉంది. అధ్యక్షుడు ఎక్కడికెళ్లాలంటే అక్కడకు తీసుకెళ్లే అపరిమిత రేంజ్ దీని సొంతం. అధునాతన సెక్యూర్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ దీని మరో ప్రత్యేకత. అంటే ఒకవేళ అమెరికాపై దాడులు జరిగితే ఆ సమయంలో ఈ విమానం మొబైల్ కమాండ్ సెంటర్గా పనిచేస్తుంది.
100మందికి వంట చేయొచ్చు..
విమానం లోపల 4000 చదరపు అడుగుల ఫ్లోర్ స్పేస్ ఉంటుంది. దీన్ని మూడు లెవల్స్గా విభజించారు. ఇందులో ఒకటి ఎక్స్టెన్సివ్ సూట్. ఇందులో అధ్యక్షుడి కోసం పెద్ద ఆఫీస్, కాన్ఫరెన్స్ గది, టాయిలెట్ ఉంటాయి. ఇక రెండోది మెడికల్ సూట్. ఇందులో ఓ డాక్టర్ శాశ్వతంగా ఉంటారు. అధునాతన సర్జరీ గది కూడా ఉంటుంది. ఇక మూడోదాన్ని వంట కోసం కేటాయించారు. విమానంలోని రెండు వంటశాలల్లో 100 మందికి సరిపడా వంట ఒకేసారి చేయొచ్చని బోయింగ్ తెలిపింది. అధ్యక్షుడు, ప్రథమ మహిళ విశ్రాంతి కోసం ప్రత్యేకమైన క్వార్టర్లు ఉంటాయి. దీంతో పాటు అధ్యక్షుడితో కలిసి ప్రయాణించే సీనియర్ అడ్వైజర్లు, సీక్రెట్ సర్వీస్ అధికారులు, ప్రెస్, ఇతర అతిథుల కో
తాజా వార్తలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం