వరల్డ్ లోనే ఫస్ట్ స్మార్ట్ మెడికల్ సెంటర్..30 నిమిషాల్లోనే యూఏఈ రెసిడెన్సీ వీసా
- February 21, 2020
దుబాయ్:సాధారణంగా మెడికల్ టెస్టు రిపోర్ట్స్ రెడీ అవటానికే గంటల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో 24 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. శాంపిల్స్ తీసుకొని వాటిని రిజిస్టర్ లో ఎంటర్ చేసేందుకే ఈజీగా అరగంట సమయం తీసుకునే ల్యాబ్ సెంటర్లు కోకొల్లలు. అలాంటిది 30 నిమిషాల్లోనే మెడికల్ టెస్టులు అన్ని పూర్తి చేసి, యూఏఈ రెసెడిన్సీ వీసా ఇవ్వటం సాధ్యమేనా? మిగతా ప్రాంతాల్లో అసాధ్యమేమోగానీ, దుబాయ్ లో మాత్రం కేవలం 30 నిమిషాల్లోనే మెడికల్ టెస్టులు పూర్తి చేసి రెసిడెన్సీ వీసా కూడా ఇచ్చేలా స్మార్ట్ మెడికల్ సెంటర్ ప్రారంభమైంది. 'సాలేమ్ ఇంటలిజెంట్ సెంటర్' పేరుతో ఏర్పాటు చేసిన స్మార్ట్ మెడికల్ సెంటర్ ను దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తౌమ్ ప్రారంభించారు. దీంతో మెడికల్ ఎగ్జామినేషన్ దగ్గర్నుంచి రెసిడెన్సీ వీసా మంజూరి వరకు పట్టే సమయం గణనీయంగా తగ్గనుంది.
ప్రపంచంలోనే ఇలాంటి సెంటర్ ఏర్పాటు కావటం ఇదే మొదటిదని యువరాజు ట్వీట్ ద్వారా తెలిపారు. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే రెసిడెంట్స్ వివరాల నమోదు, రెసిడెన్సీ వీసా మంజూరు అవుతుందని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ తో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన సాలేమ్ ఇంటలిజెంట్ సెంటర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టెక్నాలజీస్ తార్కాణంగా నిలుస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







