వరల్డ్ లోనే ఫస్ట్ స్మార్ట్ మెడికల్ సెంటర్..30 నిమిషాల్లోనే యూఏఈ రెసిడెన్సీ వీసా
- February 21, 2020
దుబాయ్:సాధారణంగా మెడికల్ టెస్టు రిపోర్ట్స్ రెడీ అవటానికే గంటల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో 24 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. శాంపిల్స్ తీసుకొని వాటిని రిజిస్టర్ లో ఎంటర్ చేసేందుకే ఈజీగా అరగంట సమయం తీసుకునే ల్యాబ్ సెంటర్లు కోకొల్లలు. అలాంటిది 30 నిమిషాల్లోనే మెడికల్ టెస్టులు అన్ని పూర్తి చేసి, యూఏఈ రెసెడిన్సీ వీసా ఇవ్వటం సాధ్యమేనా? మిగతా ప్రాంతాల్లో అసాధ్యమేమోగానీ, దుబాయ్ లో మాత్రం కేవలం 30 నిమిషాల్లోనే మెడికల్ టెస్టులు పూర్తి చేసి రెసిడెన్సీ వీసా కూడా ఇచ్చేలా స్మార్ట్ మెడికల్ సెంటర్ ప్రారంభమైంది. 'సాలేమ్ ఇంటలిజెంట్ సెంటర్' పేరుతో ఏర్పాటు చేసిన స్మార్ట్ మెడికల్ సెంటర్ ను దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తౌమ్ ప్రారంభించారు. దీంతో మెడికల్ ఎగ్జామినేషన్ దగ్గర్నుంచి రెసిడెన్సీ వీసా మంజూరి వరకు పట్టే సమయం గణనీయంగా తగ్గనుంది.
ప్రపంచంలోనే ఇలాంటి సెంటర్ ఏర్పాటు కావటం ఇదే మొదటిదని యువరాజు ట్వీట్ ద్వారా తెలిపారు. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే రెసిడెంట్స్ వివరాల నమోదు, రెసిడెన్సీ వీసా మంజూరు అవుతుందని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ తో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన సాలేమ్ ఇంటలిజెంట్ సెంటర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టెక్నాలజీస్ తార్కాణంగా నిలుస్తుంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







