వరల్డ్ లోనే ఫస్ట్ స్మార్ట్ మెడికల్ సెంటర్..30 నిమిషాల్లోనే యూఏఈ రెసిడెన్సీ వీసా
- February 21, 2020దుబాయ్:సాధారణంగా మెడికల్ టెస్టు రిపోర్ట్స్ రెడీ అవటానికే గంటల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో 24 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. శాంపిల్స్ తీసుకొని వాటిని రిజిస్టర్ లో ఎంటర్ చేసేందుకే ఈజీగా అరగంట సమయం తీసుకునే ల్యాబ్ సెంటర్లు కోకొల్లలు. అలాంటిది 30 నిమిషాల్లోనే మెడికల్ టెస్టులు అన్ని పూర్తి చేసి, యూఏఈ రెసెడిన్సీ వీసా ఇవ్వటం సాధ్యమేనా? మిగతా ప్రాంతాల్లో అసాధ్యమేమోగానీ, దుబాయ్ లో మాత్రం కేవలం 30 నిమిషాల్లోనే మెడికల్ టెస్టులు పూర్తి చేసి రెసిడెన్సీ వీసా కూడా ఇచ్చేలా స్మార్ట్ మెడికల్ సెంటర్ ప్రారంభమైంది. 'సాలేమ్ ఇంటలిజెంట్ సెంటర్' పేరుతో ఏర్పాటు చేసిన స్మార్ట్ మెడికల్ సెంటర్ ను దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తౌమ్ ప్రారంభించారు. దీంతో మెడికల్ ఎగ్జామినేషన్ దగ్గర్నుంచి రెసిడెన్సీ వీసా మంజూరి వరకు పట్టే సమయం గణనీయంగా తగ్గనుంది.
ప్రపంచంలోనే ఇలాంటి సెంటర్ ఏర్పాటు కావటం ఇదే మొదటిదని యువరాజు ట్వీట్ ద్వారా తెలిపారు. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే రెసిడెంట్స్ వివరాల నమోదు, రెసిడెన్సీ వీసా మంజూరు అవుతుందని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ తో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన సాలేమ్ ఇంటలిజెంట్ సెంటర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టెక్నాలజీస్ తార్కాణంగా నిలుస్తుంది.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..