మస్కట్:మర్హాబా ట్యాక్సీ ధరల తగ్గింపు..
- February 21, 2020
మస్కట్:ఆన్ డిమాండ్ సర్వీస్ కు మార్హాబా ఎక్కువ మొత్తం ఛార్జీలు వేస్తోందని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తటంతో ఆ సంస్థ ఛార్జీలపై సమీక్షించుకుంది. ఆన్ డిమాండ్ సర్వీసు
ధరలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. గురువారం(ఫిబ్రవరి 20) నుంచే తగ్గింపు ధరలు అమలులోకి వచ్చాయి. కొత్త ఛార్జీల ప్రకారం 800bz దగ్గర మీటరింగ్ స్టార్ట్ అవుతుంది. ఆపై
ప్రతీ కిలోమీటర్ కు 150 bz ఛార్జ్ పడుతుంది. దీంతో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యాలకు RO5 ఛార్జ్ పడుతుంది. ఉదాహారణకు రువి నుంచి మస్కట్ ఎయిర్ పోర్ట్ ఆన్
డిమాండ్ సర్వీస్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుంటే RO5 చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
రాబోయే కాలంలో గల్ఫ్ కంట్రీస్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కు వేదిక కాబోతున్నాయి. ఈ ఏడాదిలో దుబాయ్ ఎక్స్ పో 2020 జరగనుండగా..ఫిఫా వరల్డ్ కప్ 2022కి ఖతార్ వేదక కానుంది. ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ సహజకంగానే ఒమన్ కు కూడా విజిటర్స్ తాకిడి పెరుగుతుందని మార్హాబా అంచానా వేస్తోంది. ఒమన్ వచ్చే విజిటర్స్ ను దృష్టిలో ఉంచుకొని క్యాబ్ ఫేర్స్ ను తగ్గించినట్లు మార్హాబా ప్రాజెక్ట్ డైరెక్టర్ యూసుఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







