దుబాయ్:24వ ఫ్లోర్ నుంచి దూకి ఇండియన్ ఆత్మహత్య..
- February 21, 2020దుబాయ్ లో ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇండియన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళాకు చెందిన 25 ఏళ్ల సబీల్ రెహ్మాన్ తాను పని చేస్తున్న దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ బిల్డింగ్ లోని 24వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ కి పాల్పడినట్లు దుబాయ్ పోలీసులు చెబుతున్నారు. బిల్డింగ్ వాచ్ మెన్ వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు. కమాండ్ కంట్రోల్ రూంకి ఎమర్జెన్సీ కాల్ ద్వారా సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీస్ పాట్రోలింగ్ టీం, ఫోరెన్సిక్ టీంను పంపినట్లు రషిదియా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయిద్ హమద్ బిన్ సులేమాన్ అల్ మలిక్ తెలిపారు. మృతుడు స్వస్థలం కేరళాలోని మలప్పురం జిల్లా తిరూర్ గా గుర్తించారు. సబీల్ రెహ్మాన్ మృతి వార్తతో అంతని సొంతూరు విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి అందొచ్చిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడటంతో అతని కుటుంబం షాక్ నుంచి తేరుకోలేకపోతోంది.
మెడికల్, లీగల్ ప్రొసిజర్ పూర్తి చేసిన తర్వాత సబీల్ రెహ్మాన్ మృతదేహాన్ని సొంతూరికి తరలించారు. గురువారం ఉదయం 2.45 గంటలకు ఫ్లైట్ లో కేరళా చేరుకున్నట్లు సామాజిక కార్యకర్త నాసిర్ వతనాపల్లి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అతని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదిలాఉంటే..సబీల్ రెహ్మాన్ ఆత్మహత్య చేసుకున్న తీరు అక్కడి సీసీ టీవీలో రికార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు. వాచ్ మెన్ దగ్గర కీస్ తీసుకొని 24వ ఫ్లోర్ కు వెళ్లి షూస్ విప్పేసి, బాల్కనిలోనే మొబైల్ పక్కన పెట్టి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సీసీ కెమెరా ఫూటేజ్ ద్వారా తెలుస్తోంది. ఈ మొత్తం దుర్ఘటన 12 నిమిషాల్లో జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి