మనామ: చైనాకు బాసటగా నిలబడతామన్న బహ్రెయిన్ యువరాజు
- February 21, 2020
మనామ:కోవిడ్-19 వైరస్ తో సతమతం అవుతున్న చైనాకు బహ్రెయిన్ యువరాజు సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు చైనా ప్రెసిడెంట్ జింగ్ పింగ్
కు సందేశం పంపించారు. కోవిడ్-19ను ఎదుర్కొవటంలో చైనా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు వైరస్ బారిన పడి చైనాలో 2000 మందికిపైగా చనిపోగా...70 వేల మందికిపైగా ప్రజలకు వైరస్ సోకింది. వ్యాధితో చికిత్స పొందుతున్న వారందరూ త్వరగా కోలువకోవాలని ఆశిస్తున్నట్లు యువరాజు తెలిపారు. తమకు స్నేహశీలిగా ఉండే చైనా విపత్తు నుంచి తిరిగి త్వరగా పురోగతి సాధించాలని అభిలాషించారు. వైరస్ పై పోరాడటంతో చైనా ప్రజలు విజయం సాధించాలని, వైరస్ కు విరుగుడు కనుక్కోవటంలో చైనా చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితం దక్కాలని ఆకాంక్షించటంతో పాటు మెడికల్ డ్రగ్ కనుగొనటంలో చైనాకు తాము కూడా సపోర్ట్ ఇస్తామని యువరాజు అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







