యూఏఈలో మరో ఇద్దరికి కోవిడ్ -19 వైరస్..11కి చేరిన పేషెంట్ల సంఖ్య
- February 22, 2020
యూఏఈ:మహమ్మారిలా ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న కోవిడ్-19 వైరస్ ను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అంతకంతకు విస్తరిస్తూనే ఉంది. యూఏఈలో మరో ఇద్దరికి వైరస్ సోకినట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ నిర్ధారించింది. 34 ఏళ్ల ఫిలిపినో వ్యక్తితో పాటు 39 ఏళ్ల బంగ్లాదేశీ వ్యక్తికి కోవిడ్ -19 రిపోర్ట్ లో పాజిటీవ్ వచ్చినట్లు తెలిపారు. వైరస్ బారిన పడిన చైనీస్ పర్సన్స్ కు క్లోజ్ ఉండటంతో వారిద్దరికి కోవిడ్-19 సోకినట్లు చెబుతున్నారు. దీంతో యూఏఈలో కోవిడ్ - 19 కేసులు 11కి పెరిగాయి.
ఇందులో ముగ్గురు పూర్తిగా కోలుకున్నట్లు కూడా మినిస్ట్రి అధికారులు వెల్లడించారు.
అయితే..ఇప్పటికే వైరస్ బారిన పడిన వారి నుంచి ఇతరులకు వ్యాధి విస్తరించకుండా ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అండ్
ప్రివెన్షన్ తెలిపింది. వైరస్ సోకిన వ్యక్తులతో క్లోజ్ గా మూవ్ అయిన వారిపై కూడా తమ పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు వివరించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా వైరస్ వ్యాప్తి నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







