జీ5 లో ఉగాది కానుకగా 'అమృతం 2.0
- February 23, 2020తెలుగులో మోస్ట్ సక్సస్ఫుల్ సీరియల్గా పేరుగాంచిన ‘అమృతం’కు సీక్వెల్ రానుంది. హర్షవర్ధన్, శ్రీమన్నారాయణ, వాసు ఇంటూరిలతో పాటు సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్, సత్యకృష్ణలు ఈ కొత్తదానిలో మన చేత నవ్వులు పూయించడానికి వచ్చేస్తున్నారు. ఈ ద్వితీయ భాగానికి గుణ్ణం గంగరాజు కథను అందిస్తుండగా.. సందీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. లైట్ బాక్స్ మీడియా బ్యానర్ నిర్మిస్తున్న ఈ ‘అమృతం 2.0’ ఉగాది కానుకగా మార్చి 25న జీ5 ద్వారా అందుబాటులోకి రానుంది.
‘అమృతం’ సీరియల్లో అమృతరావు క్యారెక్టర్లో శివాజీరాజా, నరేష్, హర్షవర్ధన్లు కనిపించగా.. ఆంజనేయులు పాత్రలో గుండు హనుమంతరావు నటించి మెప్పించారు. ఆయన మరణించడంతో ఆ ప్లేస్లో సీనియర్ యాక్టర్ ఎల్బీ శ్రీరామ్ను తీసుకున్నారు. ఈ సీరియల్లో అంజి పాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ పాత్రలో శ్రీరామ్ ఒదిగిపోతారని అందరూ అనుకుంటున్నారు. ‘అమృతం ద్వితీయం’.. మూర్ఖత్వానికి మరణం లేదు అనే క్యాప్షన్తో ఈ సీరియల్ వస్తోంది.
ఇదిలా ఉంటే అమృతం మొదటి భాగానికి ఇప్పటికే యూట్యూబ్లో మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి. ఇటీవలకు జీ5 ద్వారా ఇది అందుబాటులో ఉంచినా.. ప్రేక్షాధారణ మాత్రం తగ్గలేదు. కాగా, అమృతం, అంజి, సర్వం, అప్పాజీ క్యారెక్టర్ల ఆధారంగా వస్తోన్న రెండో భాగంపై అందరిలో ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఈ ద్వితీయం ఎంతమేరకు మెప్పిస్తుందో.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు