అగ్ని ప్రమాదం: 36 గంటల తర్వాత దుబాయ్ టవర్కి చేరుకున్న టెనెంట్స్
- February 24, 2020
షేక్ జాయెద్ రోడ్డులోని దుజా టవర్స్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కారణంగా అధికారుల సూచన మేరకు ఆ భవనాన్ని ఖాళీ చేసిన 300 మంది టెనెంట్స్ తిరిగి అదే అధికారుల సూచనతో తమ తమ ఫ్లాట్లలోకి చేరుకున్నారు. మిగిలినవారు కూడా ఆ ఫ్లాట్లలోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టెనెంట్స్, తమ అపార్ట్మెంట్లలోకి వెళ్ళేముందు అధికారులు అన్ని ఫ్లాట్లనూ తనిఖీ చేశారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బందికి ఈ సందర్భంగా అందరూ కృతజ్ఞతలు తెలిపారు. టెనెంట్స్ సహకారంతో పరిస్థితిని చాలా వేగంగా చక్కదిద్దగలిగినట్లు అధికారులు చెప్పారు. మరోపక్క, అగ్ని ప్రమాదం కారణంగా టవర్ తాలూకు స్ట్రక్చర్ ఏమీ పాడవలేదని దుబాయ్ మునిసిపాలిటీ ఓ సర్టిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







