అగ్ని ప్రమాదం: 36 గంటల తర్వాత దుబాయ్ టవర్కి చేరుకున్న టెనెంట్స్
- February 24, 2020
షేక్ జాయెద్ రోడ్డులోని దుజా టవర్స్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కారణంగా అధికారుల సూచన మేరకు ఆ భవనాన్ని ఖాళీ చేసిన 300 మంది టెనెంట్స్ తిరిగి అదే అధికారుల సూచనతో తమ తమ ఫ్లాట్లలోకి చేరుకున్నారు. మిగిలినవారు కూడా ఆ ఫ్లాట్లలోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టెనెంట్స్, తమ అపార్ట్మెంట్లలోకి వెళ్ళేముందు అధికారులు అన్ని ఫ్లాట్లనూ తనిఖీ చేశారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బందికి ఈ సందర్భంగా అందరూ కృతజ్ఞతలు తెలిపారు. టెనెంట్స్ సహకారంతో పరిస్థితిని చాలా వేగంగా చక్కదిద్దగలిగినట్లు అధికారులు చెప్పారు. మరోపక్క, అగ్ని ప్రమాదం కారణంగా టవర్ తాలూకు స్ట్రక్చర్ ఏమీ పాడవలేదని దుబాయ్ మునిసిపాలిటీ ఓ సర్టిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







