భారత్ పర్యటన..ఈ అనుభూతి మర్చిపోలేను..మెలానియా ట్రంప్
- February 25, 2020
భారతదేశ పర్యటనను నా జీవితంలో మర్చిపోలేనిదిగా చెప్పిరు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి రెండోరోజు భారత్లో పర్యటిస్తున్న ఆమె... ఓవైపు ప్రధాని నరేంద్ర మోడీతో అధ్యక్షుడు ట్రంప్ చర్చలు జరుపుతున్న సమయంలో.. ఆమె ఢిల్లీలోని సర్వోదయ స్కూల్ను పరిశీలించారు.. మోతిబాగ్లోని సర్వోదయ సీనియర్ సెకండరీ స్కూల్ను సందర్శించిన ఆమె... విద్యార్థులతో కలిసి ముచ్చటించారు.. స్కూల్లోని "హ్యాపినెస్ క్లాస్"లో కూర్చుని విద్యార్ధుల ప్రతిస్పందనను పరిశీలించారు. టీచర్లను అడిగి అక్కడ విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, భోదన తీరును తెలుసుకున్నారు. ఇక, స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. హ్యాపినెస్ క్లాస్లు చాలా బాగున్నాయని ప్రశంసించారు.. చక్కటి అవగాహనతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తున్నారన్న ఆమె... ఇది నా మొదటి భారత పర్యటన.. ఈ పర్యటన నా జీవితంలో మర్చిపోలేనిదిగా అభివర్ణించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







