భారత్ పర్యటన..ఈ అనుభూతి మర్చిపోలేను..మెలానియా ట్రంప్

- February 25, 2020 , by Maagulf
భారత్ పర్యటన..ఈ అనుభూతి మర్చిపోలేను..మెలానియా ట్రంప్

భారతదేశ పర్యటనను నా జీవితంలో మర్చిపోలేనిదిగా చెప్పిరు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి రెండోరోజు భారత్‌లో పర్యటిస్తున్న ఆమె... ఓవైపు ప్రధాని నరేంద్ర మోడీతో అధ్యక్షుడు ట్రంప్ చర్చలు జరుపుతున్న సమయంలో.. ఆమె ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌ను పరిశీలించారు.. మోతిబాగ్‌లోని సర్వోదయ సీనియర్ సెకండరీ స్కూల్‌ను సందర్శించిన ఆమె... విద్యార్థులతో కలిసి ముచ్చటించారు.. స్కూల్‌లోని "హ్యాపినెస్ క్లాస్"లో కూర్చుని విద్యార్ధుల ప్రతిస్పందనను పరిశీలించారు. టీచర్లను అడిగి అక్కడ విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, భోదన తీరును తెలుసుకున్నారు. ఇక, స్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. హ్యాపినెస్ క్లాస్‌లు చాలా బాగున్నాయని ప్రశంసించారు.. చక్కటి అవగాహనతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తున్నారన్న ఆమె... ఇది నా మొదటి భారత పర్యటన.. ఈ పర్యటన నా జీవితంలో మర్చిపోలేనిదిగా అభివర్ణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com