భారత్ పర్యటన..ఈ అనుభూతి మర్చిపోలేను..మెలానియా ట్రంప్
- February 25, 2020
భారతదేశ పర్యటనను నా జీవితంలో మర్చిపోలేనిదిగా చెప్పిరు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి రెండోరోజు భారత్లో పర్యటిస్తున్న ఆమె... ఓవైపు ప్రధాని నరేంద్ర మోడీతో అధ్యక్షుడు ట్రంప్ చర్చలు జరుపుతున్న సమయంలో.. ఆమె ఢిల్లీలోని సర్వోదయ స్కూల్ను పరిశీలించారు.. మోతిబాగ్లోని సర్వోదయ సీనియర్ సెకండరీ స్కూల్ను సందర్శించిన ఆమె... విద్యార్థులతో కలిసి ముచ్చటించారు.. స్కూల్లోని "హ్యాపినెస్ క్లాస్"లో కూర్చుని విద్యార్ధుల ప్రతిస్పందనను పరిశీలించారు. టీచర్లను అడిగి అక్కడ విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, భోదన తీరును తెలుసుకున్నారు. ఇక, స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. హ్యాపినెస్ క్లాస్లు చాలా బాగున్నాయని ప్రశంసించారు.. చక్కటి అవగాహనతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తున్నారన్న ఆమె... ఇది నా మొదటి భారత పర్యటన.. ఈ పర్యటన నా జీవితంలో మర్చిపోలేనిదిగా అభివర్ణించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!