'తలైవి'లో శశికళ పాత్ర పోషించనున్న 'పూర్ణ'
- February 25, 2020
ఏ.ఎల్.విజయ్ `తలైవి` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విష్ణు ఇందూరి నిర్మాత. ఇప్పటికే జయలలిత కు సంబంధించి రెండు లుక్ లు రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ..జయలలితగా నటిస్తోంది. కాగా ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి .. శోభన్ బాబు పాత్రలో జిషు సేన్ గుప్తా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మరో కీలక పాత్రధారి శశికళగా అందాల నటి పూర్ణ ఎంపికైంది. శశికళ అంటే జయలలితకు ఎంతో క్లోజ్. అమ్మ జీవితంలో చాలా ఇంపార్టెంట్ పాత్ర అది. అందుకే పూర్ణకు నటించేందుకు ఆస్కారం ఉంది. ఇక ఇదే చిత్రంలో ఎంజీఆర్ వైఫ్ జానకి పాత్రలో మధుబాల నటిస్తున్నారు. ఏ.ఎల్. విజయ్ ఈ సినిమా లో పాత్రధారుల్ని ఎంతో ప్రతిష్ఠాత్మకం గా భావించి ఎంపిక చేసుకుంటున్నారు. ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







