'తలైవి'లో శశికళ పాత్ర పోషించనున్న 'పూర్ణ'
- February 25, 2020
ఏ.ఎల్.విజయ్ `తలైవి` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విష్ణు ఇందూరి నిర్మాత. ఇప్పటికే జయలలిత కు సంబంధించి రెండు లుక్ లు రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ..జయలలితగా నటిస్తోంది. కాగా ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి .. శోభన్ బాబు పాత్రలో జిషు సేన్ గుప్తా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మరో కీలక పాత్రధారి శశికళగా అందాల నటి పూర్ణ ఎంపికైంది. శశికళ అంటే జయలలితకు ఎంతో క్లోజ్. అమ్మ జీవితంలో చాలా ఇంపార్టెంట్ పాత్ర అది. అందుకే పూర్ణకు నటించేందుకు ఆస్కారం ఉంది. ఇక ఇదే చిత్రంలో ఎంజీఆర్ వైఫ్ జానకి పాత్రలో మధుబాల నటిస్తున్నారు. ఏ.ఎల్. విజయ్ ఈ సినిమా లో పాత్రధారుల్ని ఎంతో ప్రతిష్ఠాత్మకం గా భావించి ఎంపిక చేసుకుంటున్నారు. ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







