కువైట్:డోమస్టిక్ వర్కర్స్ మేలు చేసేలా న్యూ యునిఫైడ్ కాంట్రాక్ట్ పాలసీ
- February 25, 2020కువైట్:డోమస్టిక్ వర్కర్స్ పూర్తి భద్రత కల్పించేలా న్యూ యూనిఫైడ్ కాంట్రాక్ట్ పాలసీని అమల్లోకి వచ్చింది. ఈ పబ్లిక్ అథారిటీ మ్యాన్ పవర్స్ డొమస్టిక్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. డొమస్టిక్ వర్కర్స్ రిక్రూట్మెంట్ లో కొత్త కాంట్రాక్ట్ ప్రకారం..నివాస, ఆరోగ్య సంరక్షణ బాధ్యత యజమానులదే. నివాసం, ఫుడ్, క్లాత్స్ అందించటంతో వారిని వేధింపులకు గురిచేయకుండా సరిగ్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డోమస్టిక్ వర్కర్స్ కు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలి. ప్రతీ నెలాఖరులోనే కాంట్రాక్ట్ లో పేర్కొన్న జీతాన్ని ఖచ్చితంగా చెల్లించాలి. దీంతో పాటు పనివేళల విషయంలోనూ కొత్త కాంట్రాక్ట్ విధానంలోనూ పబ్లిక్ అథారిటీ మ్యాన్ పవర్స్ డొమస్టిక్ పలు సూచనలు చేసింది. రోజుకు 12 గంటలకు మించి పని చేయకూడదని సూచించింది. ప్రతీ ఐదు గంటల పని తర్వాత ఒక గంట విశ్రాంతి కల్పించాలి. రాత్రి సమయంలో ఖచ్చితంగా 8 గంటల విశ్రాంతి ఇవ్వాలి. వారంలో ఒక రోజు సెలవుతో పాటు యాన్యూవల్ లీవ్స్ కి పేమెంట్ చేయాలి. అలాగే ఏడాదిలో ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వాలి. వీటితో పాటు డొమస్టిక్ వర్కర్స్ కు చెందిన ఎలాంటి ఐడీ ప్రూవ్స్, డాక్యుమెంట్స్ యజమానులు తమ దగ్గర పెట్టుకోరాదని తెలిపింది. కొత్త కాంట్రాక్ట్ విధానంపై యజమానులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా సంతకం చేయాలి. న్యూ యూనిఫైడ్ కాంట్రాక్ట్ పాలసీ ప్రవాసీయులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..